దేశం తరఫున 12 సంవత్సరాలు ఆడిన క్రికెటర్కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అర్హత ఉండదా అని ప్రశ్నించిన భారత మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలపై సెలెక్షన్ కమిటీ స్పందించింది. తాము ఏ ఆటగాడ్ని వీడ్కోలు పలకాల్సిందిగా ఒత్తిడి చేయమని, అలాగే జట్టు ఎంపిక విషయంలో కూడా హామీ ఇవ్వలేమన్నారు. ఒకసారి ఆటగాడు జాతీయ జట్టులో స్థానం కోల్పోతే.. దేశవాళీ టోర్నీల్లో రాణించి తిరిగి జట్టులో స్థానం సంపాదించుకుంటారని సెలెక్షన్ కమిటీలో సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. జట్టుకు తన సేవలు అవసరం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే, ఢిల్లీలో చివరిసారి టెస్టు ఆడి వీడ్కోలు పలికేవాడినని ఓ టీవీషోలో పేర్కొన్న సెహ్వాగ్ వ్యాఖ్యలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు.
'వీడ్కోలు టెస్టుకు అవకాశం ఇవ్వాలా? వద్దా? అనేది సెలెక్టర్లు చేతుల్లో ఉండదు. వారి వారి ఫామ్ ను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది. జట్టులో స్థానం కోల్పోయిన తరువాత తిరిగి ఫామ్ ను నిరూపించుకోలేదు. మళ్లీ జట్టులోకి వచ్చి ఉంటే మరిన్ని పరుగులు సాధించేవాడు. ఒక మంచి ఆటగాడి నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు రావడం మమ్మల్ని నిరాశకు గురి చేశాయి. సెలెక్షన్ కమిటీ తీరును తప్పుబట్టినట్లు ఉంది. ప్రముఖ ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకున్న సెహ్వాగ్ రిటైర్మెంట్ గురించి మాకు ముందుగా ఎలా తెలుస్తుంది ' అని సెలెక్షన్ కమిటీ సభ్యుడు వ్యాఖ్యానించారు.
అయితే సెలక్షఃన్ కమిటీ స్పందనపై వీరు అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. భారత జట్టులో ఫామ్ కోల్పయి.. క్రీజులోకి వచ్చీ రాగానే.. వెనుదిరిగిపోతున్న క్రీడాకారులను ఎంపిక చేస్తున్న సెలక్టర్లు.. వీరుకు ఒక్క అవకాశం ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అయిన వారికి అకుల్లో వడ్డిస్తున్న సెలక్టర్లు.. కాని వారికి కంచాల్లో వడ్డిస్తున్నట్లు వుందని సందేహాలను వ్యక్తం చేశారు. దేశం కోసం ఆడిన వీరు ఎన్నడూ నోటీ దురుసుకు పాల్పడలేదని, అలాంటి అయన తన అభిమతాన్ని వ్యక్తం చేస్తే.. సెలక్టర్లు ఇంతలా ప్రతిస్పందిస్తారా..? అంటూ నిలదీస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more