అప్పటికే ఆ మహిళకు వివాహమైంది.. భర్తతో కొన్నాళ్లు సజావుగానే సంసారజీవితాన్ని గడిపింది.. ఇంతలోనే ఈమెకు మరో యువకుడితో పరిచయం కాగా అతనికి ఆకర్షితురాలైంది. కొన్నాళ్లకే అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఇంకొక విశేషం ఏమిటంటే.. ఆ యువకుడికి కూడా మరో అమ్మాయితో పెళ్లయ్యింది. ఆ విషయం తెలిసినప్పటికీ సదరు వివాహిత అతనిని ప్రేమించింది. ఈ ప్రేమ తారాస్థాయికి చేరడంతో తన భర్తను కాదనుకుని, ప్రియుడితోనే జీవతం కొనసాగించాలని నిర్ణయించుకుంది. కానీ.. ఆ ప్రియుడు తన భార్యతోనే జీవితం కొనసాగిస్తానని, తన ప్రేమను అంగీకరించనని తేల్చి చెప్పడంతో ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
గుమ్మగట్ట మండలం నేత్రపల్లి గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళకు కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం అయింది. అతనితో సంతోషంగానే సంసార జీవితాన్ని గడుపుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈమెకు అదే గ్రామానికి చెందిన రుద్ర అనే యువకుడితో పరిచయం అయింది. ఆ యువకుడికి ఇటీవల పెళ్లయ్యింది కూడా. ఈ విషయం జయలక్ష్మీకి తెలిసినప్పటికీ అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన ఈమె.. తన బర్తను కాదనుకుని రుద్రతోనే వుండేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయం జయలక్ష్మీ భర్తకు తెలియగా.. ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. మొత్తం వ్యవహారం బట్టబయలు కాగా.. అటు రుద్ర కుటుంబంలోనూ తగాదాలు ఏర్పడ్డాయి. చివరికి ఈ పంచాయతీ పంచాయతీ పోలీసుల వరకూ వెళ్లింది. ఈ మొత్తం తతంగం విని ఖంగుతిన్న పోలీసు అధికారులు.. ఎవరి కాపురం వారు చక్కగా చేసుకోవాలని సర్దిచెప్పి పంపించారు.
తాను ప్రియుడితోనే వుంటానంటూ జయలక్ష్మీ వాదించగా.. ప్రియుడు రుద్ర మాత్రం తన భార్యతోనే ఉంటానని తెగేసి చెప్పాడు. దీంతో కథ అడ్డం తిరిగింది. భర్తను వదిలేసి ప్రియుడితో జీవితాన్ని సంతోషంగా గడుపుదామని భావించిన జయలక్ష్మీకి రుద్ర నిర్ణయం మింగుడు పడలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. మంగళవారం రాత్రి రుద్ర ఇంటి వద్దకు వెళ్లి పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more