బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోదశ పోలింగ్ నేడు జరుగుతున్నాయి. ఆరు జిల్లాల్లో పరిధిలోని 50 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న పోలింగ్లో మాహువా, రాఘోపూర్ల నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అధ్యక్షుడి ఇద్దరు కుమారుల భవితవ్యంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాజకీయంగా లాలూకు పట్టున్న శరణ్ జిల్లాలో 10, సీఎం నితీశ్కుమార్ సొంత జిల్లాలోని ఏడు స్థానాలు ఉన్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి ప్రసాద్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మహాకూటమి, ఎన్డీఎ కూటమి మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది. ఈ రెండు ఫ్రంట్లకు చెందిన నాయకులు బీహార్లో హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ మూడో విడత ఎన్నికల్లో 1.45 కోట్ల మంది ఓటర్లు 808 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారని రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి (ఏసీఈవో) ఆర్ లక్ష్మణన్ తెలిపారు. వీరిలో 71 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. లాలూ కుమారులు తేజ్ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ లతో పాటు రాష్ట్రమంత్రులు శ్యామ్ రజాక్ (ఫుల్వారి), శ్రవణ్కుమార్ (నలంద), అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అమరేంద్రప్రతాప్సింగ్ (ఆరా), బీజేపీ నేత నంద్కిశోర్యాదవ్ (పాట్నా సాహిబ్), అసెంబ్లీలో బీజేపీ చీఫ్విప్ అరుణ్కుమార్ సిన్హా (కుమ్ హ్రార్) పోటీలో ఉన్న ప్రముఖులు. 14,170 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6747 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం కాగా, 1909 బూత్లు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని ఏసీఈవో లక్ష్మణన్ తెలిపారు. 716 పోలింగ్ బూత్ల పరిధిలో లైవ్ వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more