మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం, గొల్లపల్లిలో టీఆర్ఎస్ నేత భూదాహం ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. ఆదివారం ఉదయం బాధిత కుటుంబంల సామూహిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీఆర్ఎస్ నేతగా చెలామణి అవుతున్న ఇర్ఫాన్ ఇంటి ఎదుట ఓ తండ్రి సహా నలుగురు కుమారులు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు అందులో ఇద్దరు కుమారులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఆ కుటుంబానికి ఉన్న స్థలాన్ని టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆ కుటుంబం మనస్తాపం చెంది.. ఇర్ఫాన్ ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది.
కుటుంబ యజవనిఇ వెంకటయ్యకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడ కమ్యూనిటి హాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన వెంకటయ్య ఆతని నలుగురు కుమారులు శ్రీశైలం, కుమార్, మహేష్,, చంద్రశేఖర్ వీరంతా టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో శ్రీశైలం, మహేష్ ఇద్దరు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మృతదేహాలను రోడ్డుపై ఉంచి వారి బంధువులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించలేదు. సంఘటనా ప్రదేశానికి పోలీసులు రావడంతో బాధిత కుటుంబ బంధువులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ముందే తగు చర్యలు తీసుకుని వుంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని వారు పేర్కోంటున్నారు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more