ప్రజాసేవే తన లక్ష్యమంటూ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన ఓ నాయకుడు మైనర్ బాలికను చెరిచాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ నీచుడు కన్నకూతురితో సమానమైన తన ఇంట్లో పనిచేసే అమ్మాయిపైనే అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలోని గౌహతిలో వెలుగుచూసింది.
అసోంలోని ఏఐయూడీఎఫ్ కు చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ పై తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. ఆ ఇంట్లోనే పనిచేసే బాలికపై గోపినాథ్ అత్యాచారానికి పాల్పడ్డారని, ఈమేరకు బాధితురాలు బోకో పోలీస్ స్టేషన్ పరిధిలోని మంది ఔట్ పోస్టులో గత నెల 29న ఫిర్యాదు చేసింది. గౌహతిలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేసినట్లుగా ఆ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. తొలుత ఈమె ఫిర్యాదును పోలీసులు అంగీకరించలేదు. అయినప్పటికీ ఆ మైనర్ బాలిక తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూరాలని కోరుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. దీంతో స్పందించిన పోలీసులు.. వెంటనే కేసు నమోదు చేయకుండా తమదైన రీతిలో దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా వారికి ఆశ్చర్యకరమైన నిజాలు తెలియడంతో.. ఆ మైనర్ బాలిక ఫిర్యాదును స్వీకరించి, ఆ ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే.. తనమీద వచ్చిన ఈ అత్యాచార ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని గోపీనాథ్ ఖండించారు. తనపై కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఆ బాలిక తమ ఇంటి నుంచి కొన్ని వస్తువులు దొంగలించి పారిపోయిందని ఆ ఎమ్మెల్యే ఆరోపించారు. దీంతో డైలామాలో పడ్డ పోలీసులు.. ఆ బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారని తెలిసింది. ఈ కేసు చిక్కుముడి ఎన్నడూ వీడుతుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more