ఏపీలో వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి 23 మంది చనిపోయారు. నెల్లూరు జిల్లాలో ఆరుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు , గుంటూరు జిల్లాలో ఇద్దరు పిడుగుపాటుకు ప్రాణాలు వదిలారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గానుగపెంటలో పిడుగు అత్తా కోడళ్లను బలి తీసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తిలో తండ్రి కొడుకులు చనిపోయారు. కృష్ణా జిల్లా రెడ్డి గూడెం మండలం కూనపరాజు పర్వలో దగ్గరి బంధువులు ఇద్దరూ ఒకేచోట ఉన్న టైంలో పిడుగుపడి ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇలా కోస్తా అంతటా పిడుగుల వర్షం కురిసింది. పెను విషాదం నింపింది. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం అమ్మవలస దగ్గర వాగు పొంగి 25 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.
తాజా పరిస్థితిని సిఎం చంద్రబాబు సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీ మీద బలంగా ఉంది. రాష్ట్రమంతటా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం రేపు కూడా ఉంటుందని ప్రకటించింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇన్నాళ్ళు చుక్క నీరు లేక అల్లాడిపోయిన రైతులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఖరీఫ్లో కనీసం మెట్ట పంటలైనా వేసుకోవచ్చన్న ఆనందంలో ఉన్నారు రైతులు. కాగా నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం భీభత్సాన్ని సృష్టించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more