దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు ఓ అరుదైన విషయాన్ని కనుగొనగలిగారు. షీనాను హతమార్చిన స్థలంలో అంటే రాయ్ గఢ్ అడువుల్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు ఓ పుర్రె లభ్యమైంది. ఆ పుర్రె షీనాబోరా ముఖ రేఖాకృతితో సరిపోలినట్లుగా తమ డిజిటల్ సూపరింపొజిషన్ లో తేలిందని శుక్రవారం ముంబై పోలీసులు వెల్లడించారు. ఆ స్థలంలో ఆమె బాడీకి సంబంధించిన ఇతర భాగాలు కూడా లభ్యమవుతాయేనన్న విషయంపై సోదాలు నిర్వహిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు.
మరోవైపు.. ఈ హత్యకేసులో భాగంగా ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లు పోలీస్ కస్టడీలో వున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిని పలుసార్లు విచారించారు. మరోసారి శుక్రవారం సాయంత్రం ఆ ముగ్గురితోపాటు పీటర్, షీనా తండ్రి సిద్ధార్థ్ దాస్ తదితరులను ఖార్ పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘంగా విచారించారు. అలాగే.. తొలిసారి ఇంద్రాణి, ఖన్నాల కూతురు విధిని కూడా కాసేపు ప్రశ్నించి పంపించేశారు. ఇదిలావుండగా.. ఈ కేసులో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను తామింకా నిర్దోషిగా తేల్చలేదన్నారు. ఇంకా అతనిని నిందితుడిగా కూడా చేర్చలేదని తెలిపారు. ఈ కేసులో భాగంగా ఆయన్ను విచారించేందుకు స్టేషన్ కు పిలిచినట్లు స్పష్టం చేశారు.
కాగా.. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఇంద్రాణి రకరకాల కొత్త కథనాలను పోలీసుల విచారణలో వెల్లడిస్తోంది. ఇప్పటికే షీనా బతికేవుందని ఓసారి, మిఖాయిల్ తన కొడుకే కాదని మరోసారి, ఇలా నాటకాలాడుతూ వస్తోంది. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ఆమె ఇలా డొంకతిరుగుడు కథనాలు సృష్టిస్తోందని భావించిన పోలీసులు.. తమదైన రీతిలో ఆమెను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more