ఎంతో కాలంగా నొటిఫికేషన్ల కోసం మొహం వాచేలా వేచి చూసిన నిరుద్యోగులకు శుభవార్త. టిఎస్ పీఎస్సీ ద్వారా ఇక నోటిఫికరేషన్ల జాతర మొదలుకానుంది. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులకు టీఎస్ పీఎస్సీ మరో తీపి కబురు అందించింది. టీఎస్ పీఎస్సీ రేపు మరో నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. దీనిద్వారా ప్రజారోగ్య, మున్సిపల్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్లలో సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ క్యాటగిరీల్లో 563 అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులను భర్తీచేయనున్నారు. కమిషన్ సభ్యుల బృందం ఈ మేరకు మూడు ప్రభుత్వశాఖల్లోని ఇంజినీర్ కొలువుల భర్తీకి సంబంధించిన ప్రకటనను, సిలబస్ను ఖరారు చేసింది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీనాటికి కనిష్ఠంగా 18 ఏండ్లు, గరిష్ఠంగా 44 ఏండ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ సడలింపు ఉన్నవారికి ఆ మేరకు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 28. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే తమ వివరాలను నమోదు చేసుకున్న వారు తమ వివరాలతో లాగిన్ అవ్వాలి. ఈ ఉద్యోగాల భర్తీకి చెందిన పూర్తి సిలబస్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను అక్టోబర్ 25వ తేదీన నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ పరీక్ష హైదరాబాద్లోనే (హెచ్ఎండీఏ పరిధి)లో మాత్రమే నిర్వహించనున్నారు. సవివర నోటిఫికేషన్ శనివారంనుంచి అందుబాటులో ఉండనుంది. పరీక్షలు జరిగిన రెండు వారాలలోపు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కమిషన్ తగు చర్యలు తీసుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more