నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతుల సమస్యలు వినడానికే వచ్చానని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ రాజధాని భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో పర్యటించిన ఆయన ఆదివారం మధ్యాహ్నం తాడేపల్లి మండలం పెనుమాక చేరుకుని అక్కడ ప్రభుత్వ కాలేజీలో ఏర్పాటు చేసిన రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'మీ సమస్యలు వినడానికే వచ్చా... సహకరించండి' అంటూ విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ చేస్తే మీకు ఏంటి సమస్య అని పవన్ పశ్నించగా... అన్నదాతలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
ల్యాండ్ పూలింగ్కు తాము పూర్తి వ్యతిరేకమని, ఏపీ రాజధానికి తమ భూములు ఇవ్వబోమని పెనుమాక రైతులు స్పష్టం చేశారు. తమ భూములు ఏడాదికి మూడు పంటలు పండుతున్నాయని, ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ తమకు గిట్టుబాటు కాదని వారన్నారు. ఇక్కడకు వచ్చిన ప్రభుత్వ అధికారులు, మంత్రులు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, స్వచ్చంధంగా భూములు ఇస్తే ప్రభుత్వం పరిహారం ఇస్తుందని, లేకపోతే భూ సేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటామని... ఆ విధంగా చేస్తే మీకు నష్టమని మంత్రులు, అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఏ బాధ వచ్చిన తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకునేవారమని, ఇప్పుడు మీరే మాకు దేవుడని రైతులు పవన్ కల్యాణ్ను వేడుకున్నారు. తమ తరఫున ప్రభుత్వంతో మాట్లాడాలని, తమ సమస్యలను ముఖ్యమంత్రికి తెలపాలని రైతులు పవన్కు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ భూ సేకరణ చేస్తే మేం ఆత్మహత్యలు చేసుకోవాలని, వేరే దారి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ తమకు ఏ మూలకు సరిపోదని వారన్నారు. పవన్ రైతుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. బలవంతంగా భూములు లాక్కుంటున్నారని రైతులు ఆయనకు మొరపెట్టుకున్నారు. భూములు ఇవ్వకుండానే ఇచ్చామని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. భూసమీకరణపై స్పష్టత లేదన్నారు. ఉండల్లి, పెనుమాన ప్రాంతాల్లో పండిన పంటలను రైతులు పవన్ కల్యాణ్ కు చూపించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more