చర్చలంటూనే వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్తో జాతీయ భద్రతా సలహారుల స్థాయి చర్చలను రద్దుచేయాలని ఇండియా నిర్ణయించినట్లు సమాచారం. ఉగ్రవాదం అంశంపైనే చర్చలు జరుపాలని రెండు దేశాల ప్రధానులు నిర్ణయించినప్పటికీ తాజాగా పాకిస్థాన్ జమ్ముకశ్మీర్తోసహా ఇతర అంశాలను కూడా ఎజెండాలో చేర్చటంతో భారత్ కఠిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కాల్పులకు పాల్పడుతూ ఉగ్రవాదులను భారత్ భూభాగంలోకి పంపటమేకాకుండా పుండుమీద కారం చల్లినట్లుగా కశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ చర్చలకు ఆహ్వానించటం ఇండియాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
తాజా పరిణామాలతో చిత్తశుద్ధిలేని చర్చలతో ప్రయోజనం ఉండదని పాకిస్థాన్కు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఇండియా భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం అంశంపైనే జరుగాలన్న తమ విధానానికి కట్టుబడి ఉన్నామని హోంమంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టంచేశారు. ఈ నెల 24న భారత ఎన్ఎస్ఏ అజిత్దోవల్, పాక్ ఎన్ఎస్ఏ సర్తార్ అజీజ్ ఢిల్లీల్లో చర్చలు జరపాల్సి ఉంది. అయితే చర్చలు రద్దు చేస్తున్నట్టు ఎటువైపు నుంచీ అధికారిక ప్రకటన రాలేదు. అటు చర్చల విషయంలో తన బుద్ధి మారలేదని పాకిస్థాన్ నిరూపించుకొంది. చర్చల ప్రతిపాదనలు వచ్చిన ప్రతిసారీ జమ్ముకశ్మీర్ వేర్పాటువాదులను భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తున్న దాయాది దేశం.. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేసింది. చర్చలు ఇష్టంలేకనే పాకిస్థాన్ ఇలా పదేపదే వ్యవహరిస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చర్చలంటూనే పాక్ కవ్వింపులకు పాల్పడుతూ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. రష్యాలోని ఉఫాలో భారత్, పాక్ ప్రధానులు నరేంద్రమోడీ, నవాజ్ షరీఫ్లు కలుసుకున్న సమయంలో ఉగ్రవాద నిర్మూలనపై రెండుదేశాల మధ్య ఎన్ఎస్ఏల స్థాయిసో చర్చలు జరుపాలని నిర్ణయించారు. అయితే, ఆ తర్వాత చర్చలపై పాక్ ఏరోజూ చిత్తశుద్ధిని ప్రదర్శించలేదను. సరిహదుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు, భారత భూభాగంలోకి టెర్రరిస్టులను పంపుతూ ఇండియా సహనాన్ని పరీక్షిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more