ఏపీకి ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ కార్యకర్త మునికామకోటి తనను తాను నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన విషయం విదితమే! ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సభలో నేతలు మాట్లాడుతుండగానే మునికోటి ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు. ఈ ఉదంతాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలార్పి, అతనిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైలోకి కెఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. 90 శాతం శరీరం కాలిపోవడంతో అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
అయితే.. ఈ ఉదంతం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు తమ సభను కొనసాగించడంతో ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక వ్యక్తి తననితాను నిప్పంటించుకుంటుంటే అతడిని కాపాడాల్సిందిపోయి తమ రాజకీయ స్వలాభాలకోసం సభను కంటిన్యూ చేశారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ఆ సభకు హాజరైన ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ముగిసిన వెంటనే అక్కడినుంచి చిరంజీవి వెళ్లిపోవడంతో స్థానికులు మరింత ఊగిపోయారు. ప్రజల ఆగ్రహాన్ని గుర్తించిన చిరు.. మునికోటి అంత్యక్రియల విషయమై దగ్గరుండి చూసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన, రఘువీరా రెడ్డి మునికోటి మృతదేహాన్ని తిరుపతికి తీసుకొచ్చేందుకు చెన్నైకి బయలుదేరారు.
చెన్నైకి చేరుకున్న అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. మునికోటి ఆత్మహత్య తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఆత్మబలిదానం చేసుకున్న మునికోటి ఆశయ సాధన కోసం పోరాడతామని ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్గాలు మునికోటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more