మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారంనాడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ తో సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆయన త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అనంతరం మెదక్ పార్లమెంట్ స్థానానికి సీఎం కేసీఆర్ రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినా ఓటమి తప్పలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకే వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం.
బిజెపి పార్టీలో చేరడం తొందరపాటు చర్య అని, కాంగ్రెస్ పార్టీని వీడినందుకు సోనియాగాంధీకి క్షమాపణలు కోరుతున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. మొత్తానికి ఆ గూడు ఈ గూడు అన్ని తిరిగి మళ్లీ పాత కూటికే చేరడం జగ్గారెడ్డి వంతైంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగ్గారెడ్డి ఎంతో ప్రాచుర్యం పొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడి.. కాంగ్రెస్ నేతగా తన నియోజక వర్గానికి భారీగా నిధులు సంపాదించారు. అయితే తాజాగా గత కొంత కాలంగా బిజెపి పార్టీలో చేరినా కానీ పెద్దగా వార్తల్లో నిలవలేదు. మొత్తానికి తన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని జగ్గారెడ్డి నర్ణయించుకోవడం కాంగ్రెస్ పార్టీకి కాస్త మేలు చేసే అంశం. అందుకే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి చేరిక మీద వేగంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more