జింబాబ్వేతో జరుగుతున్న తొలివన్డే మ్యాచ్ లో టీమిండియా.. అతిధ్య జట్టు ముందు 256 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత యాభై ఓవర్లలో టీమిండియా ఆరు విక్కెట్ల నష్టానికి 255 పరుగులు సాధించింది. తెలుగు తేజం అంబటి రాయుడు అద్బుత సెంచరీతో రాణించాడు. అంబటి రాయుడుకు స్టూవర్ట్ బిన్ని కూడా సహకరించడంతో భారత్ మెరుగైన స్కోరు చేయగలిగింది.మ్యాచ్ ఆరంభంలో పరుగులను చేయడానికి టీమిండియా చమటోడ్చింది. చాన్నాళ్ల తరువాత వన్డే జట్టులో స్థానం పోందిన మురళీ విజయ్ ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. కేవలం ఒక్క పరుగుకే అవుటై వెనుదిరిగాడు.
ఆ తరువాత బ్యాటింగ్ లోకి దిగిన అంబటి రాయుడు, వన్డే కెప్టెన్ రహానే కలసి జింబ్వాబే బౌలర్లను నిదానంగా ఎదుర్కోన్నారు. ఒక క్రమంలో పది ఓవర్లకు 35 పరుగులు మాత్రమే టీమిండియా చేసింది. ఈ ధశలో కెప్టెన్ రహానే 34 పరుగలు వద్ద అవుట్ కావడంతో ఆ తరువాత వచ్చిన మనోజ్ తివారీ, రాబిన్ ఉత్తప్ప, కేధార్ జాదవ్ లు వెనువెంటనే పెవీలియన్ కు చేరుకున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు స్కోరు రెండకెలకు కూడా చేరుకోలేదు. ఈ దశలో వచ్చిన స్టువర్ట్ బిన్ని నిలదొక్కుకుని ఆరు ఫోర్లు రెండు సిక్స్ లతో అంబడి రాయుడికి సహకరించడంతో వీరిద్దరు బాగస్వామం 145 పరుగులు వరకు కొనసాగింది.
స్టువర్ట్ బిన్ని76 బంతుల్లో 77 పరుగులతో అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీస్ లోకి వచ్చిన మరో ఆటగాడు అక్షర్ పటేల్ రెండు పరుగులతో నాటౌట్ గా నిలువగా, అంబటి రాయుడు 133 బంతులు ఎదుర్కోని ఒక సిక్సర్, 12 ఫోర్ల సాయంతో 124 పరుగులతో అంబటి రాయుడు జింబాబ్వే పై రెండో అజేయ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. జింబాబ్వే జట్టులో డోనాల్డ్ తిరిపానో, చమ్ము చిబ్బాబ్బ చెరో రెండీసీ వికెట్లు పడగొట్టగా, బ్రాయన్ విటోరి ఒక్క వికెట్ ను సాధించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వేను బ్యాటింగ్ చేయాల్సి వుంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more