తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంటక వీరయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓటుకు నోటు కేసులో సండ్ర ఎంతో కీలకంగా వ్యవహరించారని, రేవంత్ రెడ్డి కన్నా ముందుగా సండ్ర వెంటక వీరయ్య ఓటుకు నోటు వ్యవహారంలో వధ్యవర్తిత్వం నిర్వహించారని తెలంగాణ ఏసీబీ భావిస్తోంది. అందుకే రెండు సార్లు నోటీసులు ఇచ్చి మరి విచారణకు హాజరయ్యేలా చేసింది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన సండ్ర వెంటక వీరయ్యకు సంబందించిన ఏసీబీ అధికారులు పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. కేసులో ప్రత్యక్ష ప్రమేయమున్న నేపథ్యంలోనే సండ్రను అరెస్టు చేశామని ఏసీబీ అధికారులు వివరిస్తున్నారు. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలతో సండ్ర ఏకంగా 23 సార్లు ఫోన్ లో మాట్లాడారని వారు అంటున్నారు. ఈ విషయంలో పక్కా ఆధారాలతో సండ్రను అరెస్టు చేశామని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే నిన్న ఉదయం విచారణకు హాజరైన సండ్రను విచారించి, చివరకు రాత్రి పూట అరెస్టు చేశారు తెలంగాణ ఏసీబీ అధికారులు. అయితే సండ్ర వెంకట వీరయ్య అరెస్టును ఏసీబీ అధికారులు ధ్రృవీకరించలేదు.
Also Read: ఏసీబీ రమ్మంటే అనారోగ్యం అంటున్న సండ్ర
ఇదే అనుమానాలను తావిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంలో సండ్రను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఎందుకు సండ్ర అరెస్టును ధ్రృవీకరించడం లేదు.? ఏసీబీ అధికారులు సండ్ర విషయంలో గేమ్ ప్లాన్ వేస్తున్నారా..? ఓటుకు నోటు వ్యవహారంలో ఎవరెవరు కీలకంగా ఉన్నారో వారిని తీవ్ర వత్తిడికి గురి చెయ్యడమే ఏసీబీ లక్ష్యమా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నా కానీ సమాధానాలు మాత్రం లేవు. సండ్ర అరెస్టు తర్వాత ఏసీబీ అధికారులు ఎందుకు కనీసం స్పందించడం లేదు...? సండ్ర అరెస్టు ను ఏసీబీ దృవీకరించడపోవడానికి రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయా..? లేదా అరెస్టును ప్రకటించిన వెంటనే బెయిల్ పై బయటకు వెళతారని కావాలనే ఏసీబీ అధికారులు బావిస్తున్నారా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఏసీబీ ముందుకు సండ్ర.. ఏం జరగబోతోందన్న ఉత్కంఠ
అయితే ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్టును ఇప్పటి దాకా ఏసీబీ అధికారింకరంగా ప్రకటించలేదు. రాత్రి 11 గంటలదాకా సండ్ర వెంకట వీరయ్య అరెస్టు పై ఏసీబీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వీడుదల కాలేదని సండ్ర తరఫు లాయరు వివరించారు. సండ్ర అరెస్టును ఏసీబీ ప్రకటించిన వెంటనే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అసలు రాత్రంతా సండ్రను ఏసీబీ అధికారులు తమ అదుపులో ఎలా ఉంచుకుంటారని కూడా న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. అయితే సండ్ర అరెస్టు మీద ఏసీబీ అధికారికంగా ప్రకటించిన కొద్ది సేపటికే బెయిల్ పిటిషన్ దాఖలు చెయ్యడం.. అన్నీ కుదిరితే బయటకు తీసుకురావడానికి అన్కని ఏర్పాట్లు చేస్తున్నారు సండ్ర తరఫు లాయరు. మరి ఏం జరుగుతుందో నేడు చూడాలి.
Also Read: ఓటుకు నోటు కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర అరెస్టు
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more