రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన బాధిత కుటుంబాన్ని అదుకుంటానని బాలీవుడ్ డ్రీమ్ గాళ్, అలానటి నటి.. మధుర నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బిజేపీ ఎంపి హేమా మాలిని చెప్పారు. ఇవాళ అసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అమో ప్రత్యేక చార్టెడ్ విమానంలో ముంబాయికి చేరుకున్నారు. తన కూతరు ఇసాడయాల్, అమె భర్త తొడురాగా, అమె వారితో పాటు ముంబాయిలోని జుహూ ప్రాంతంలోని తమ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అమె కూతరు ఇషా డియోల్ జుహులో మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో గాయాలపడిన కుటుంబాలను అదుకుంటామని తమ తల్లి హేమామాలిని చెప్పారన్నారు.
రాజస్థాన్లోని దౌసాలో అమె ప్రయాణిస్తున్న బెంజ్ కారు.. అల్గో కారును ఢీ కోనడంతో అల్టోకారులోని చిన్నారి మరణించగా, మిగిలిన ఐదుగురు తీవ్రంగా క్షతగాత్రులయ్యిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలోని వచ్చిన విమర్శలను అమె తోసిపుచ్చారు. తమ తల్లి నిద్రలో వుండగా ప్రమాదం సంభవించిందని చెప్పారు. అయినా..అమె ఒక మహిళ అన్నవిషయాన్ని ముందుగా తెలుసుకోవాలన్నారు. ప్రమాదం సంభవించడంతో.. అమెను దారిన పోయేవారు అస్పత్రిలో చేర్పించారని.. అమెకు ప్రమాదం ఎలా సంభవించింది, ఎవరెవరికి గాయాలయ్యాయన్న విషయం తెలియదని చెప్పారు.
అయినప్పటికీ తమ తల్లి బాధిత కుటుంబాలను అధుకునేందుకు ముందుకు వచ్చారని ఇది అమె ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీగా కాకుండా.. ఒక మనస్సున్న తల్లిగా చేస్తున్నారని ఇషా తెలిపింది. ప్రమాదంలో చిన్నారిని కోల్పయిన వారి కోసం అమె వేదన పడుతున్నారని చెప్పింది. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు అమె కొన్ని రోజుల పాటు తమ నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటారని ఇషా తెలిపింది. అయితే అమె పరిస్థతి ఇప్పుడు కాస్త మెరుగ్గా వుందని, అయినా ఇప్పుడు అమె ఎవరినీ కలుసుకునే పరిస్థితిలో లేరని చెప్పింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more