ఒక రోజుకు ఎన్ని సెకన్లని ఏ హైస్కూలు విద్యార్థినైనా అడిగితే 86,400 సెకన్లని సమాధానం చెప్తాడు. నిజానికి అది సరైన సమాధానమే. అయితే ఈ జూన్ 30 మాత్రం మామూలు రోజుకన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అదనంగా ఒక లీపు సెకనును ఈ రోజుకు జోడించనున్నారు. అలా ఎందుకు చేయాల్సి వస్తుందో అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) కారణాలు కూడా తెలియజేసింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని మన అందరికీ తెలుసు. అయితే భూమి పరిభ్రమణ వేగం రానురాను కాస్త తగ్గుతూ ఉంది. అందువల్ల ఆ లోటును భర్తీ చేయడానికి లీపు సెకనును జోడించడం ఒక మార్గమని మేరీలాండ్ గ్రీన్బెల్ట్ ప్రాంతంలో ఉన్న నాసా గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కు చెందిన డేనియల్ మాక్మిలన్ చెప్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా జనం తమ దైనందిన జీవితాల్లో ఉపయోగించే యుటిసిగా పికోర్డినేటెడ్ యూనివర్సల్ టైమింగ్ విషయానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. యుటిసి అనేది ఆటోమేటిక్ టైమ్. అది ఎంత కచ్చితమైన సమయం అంటే 14,00,000 సంవత్సరాలకు ఒక్క సెకను మాత్రమే తేడా వచ్చే అవకాశం ఉంది. అయితే మామూలు సౌర రోజు అంటే భూమి తన చుట్టూ తాను ఒక సారి పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుందనే ఆధారంగా నిర్ణయించిన రోజుకు దాదాపు86,400.002 సెకన్లుగా లెక్క వేసారు. భూమి, చంద్రుడు, సూర్యుడి మధ్య ఆకర్షణ శక్తికి సంబంధించి జరిగే యుద్ధం అనే బ్రేకింగ్ శక్తి కారణంగా భూమి పరిభ్రమణ వేగం స్వల్పంగా తగ్గుతూ వస్తోంది అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.
దాదాపుగా 1820 సంవత్సరం అంతకు ముందునుంచే ఈ మామూలు సౌర రోజుకు 86,400 సెకన్లుగా ఉండడం లేదని శాస్తజ్ఞ్రులు అంచనా వేసారు. అంటే ఈ రెండు మిల్లీ సెకన్ల తేడా (ఇది నిజానికి రెప్పపాటుకన్నా తక్కువ సమయం)ను మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ చిన్న పాటి తేడా ప్రతి రోజూ ఏడాది పొడవునా సంభవిస్తే అదంతా కలిపితే దాదాపు ఒక సెకను అవుతుంది. అందుకే ఒక లీపు సెకనును జూన్ 30, లేదా డిసెంబర్ 31న జోడిస్తూ ఉంటారు. మామూలుగా గడియారం 23 గంటల 59 నిమిషాల 59 సెకన్ల తర్వాత జీరో అవర్ వచ్చి మరుసటి రోజు మొదలవుతుంది.
అయితే లీపు సెకనును చేర్చినప్పుడు మాత్రం గడియారం 23:59:59: చూపించిన తర్వాత 23:59:60కి మారి ఆ తర్వాత జూలై 1వ తేదీలోకి 00:00:00కు మారుతుంది. అలా చేయడానికి బదులు మామూలుగా చాలా సిస్టమ్లను ఒక సెకను పాటు ఆపేస్తారు. ఇంతకు ముందు లీపు సెకన్లను కలిపినప్పుడు కొన్ని రకాల కంప్యూటర్ వ్యవస్థల్లో అనేక సమస్యలు తలెత్తాయి. అయితే ఇప్పుడలాంటి సమస్యలేమీ తలెత్తక పోవచ్చని శాస్తజ్ఞ్రులు భావిస్తున్నారు. మొట్టమొదటిసారి లీపు సెకనును చేర్చిన 1972నుంచి 1999 దాకా ప్రతి సంవత్సరం దాదాపు ఒక లీపు సెకనును చేరుస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత దీని ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటోంది. నిజానికి జూన్ 30న జోడించే లీపు సెకను 2000నుంచి ఇప్పటివరకు అదనంగా చేర్చిన నాలుగో లీపు సెకను మాత్రమే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more