Lawyers | ACB | Revanth Reddy | Stephenson

Revanth reddy lawyers got main point on note for vote scandl case

ACB, Revanth Reddy, noteforvote, Stephenson

Revanth Reddy lawyers got main point on note for vote scandl case. Revanth Reddy lawyers defance the telangana ACB in the court.

కరెక్ట్ పాయింట్ పట్టిన రేవంత్ లాయర్లు

Posted: 06/10/2015 12:44 PM IST
Revanth reddy lawyers got main point on note for vote scandl case

రేవంత్ రెడ్డి అరెస్టుతో ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తారా స్థాయికి చేరుకుంది. అయితే ఇదంతా తెలంగాణ సర్కార్ చేస్తున్న కుట్ర అని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి అంశంతో ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలు మరింతగా పెరిగాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని వాదన. అయిత తెలంగాణ సర్కార్ మాత్రం మరోలా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చెయ్యడం లేదని.. కేవలం స్టీఫెన్ సన్ చేసిన ఫిర్యాదు మేరకే నిఘా ఉంచామని తెలిపారు. అలా నిఘా ఉంచిన తర్వాత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారని, అందులో భాగంగా చంద్రబాబు మాట్లాడిన విషయాలు కూడా బయటకు వచ్చాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే ఏసీబీ అధికారులు చెబుతున్న మ్యాటర్ లో ఓ లాజిక్ ను బాగా క్యాచ్ చేశారు రేవంత్ రెడ్డి తరఫు లాయర్లు. అదేంటంటే..

స్టీఫెన్ సన్ గత నెల 28న ఫిర్యాదు చేశారు. కానీ ఏసీబీ వాళ్లు మాత్రం 31న కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదు అందిన మూడు రోజుల పాటు ఆడియో, వీడియో రికార్డింగ్ ఎ:దుకు చేశారని రేవంత్ రెడ్డి తరపు లాయర్లు ప్రశ్నించారు. కేసు నమోదు చేయకుండా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయడం చట్టవిరుద్దమని కూడా వారు అంటున్నారు. కేసు నమోదు చేయకుండానే దర్యాప్తు ఎలా చేస్తారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా 28న అందిన ఫిర్యాదుపై 31న కేసు నమోదు చేశామని చెబుతున్న ఏసీబీ వాదనలో కుట్ర కోణం దాగుందని రేవంత్ తరఫు లాయర్లు కోర్టుకు వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB  Revanth Reddy  noteforvote  Stephenson  

Other Articles