అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని విస్మరించిన పక్షంలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కారుకు కూడా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం మాదిరిగానే మనజాలదని వీహెచ్పీ ఘాటుగా హెచ్చరించింది. గత ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసింది కేవలం అభివృద్ధిని చూసి మాత్రమే కాదని, వాళ్ల ప్రధాన ఆకాంక్షలను కూడా నెరవేరుస్తారని భావించారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి, జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, తమ ఆశలు మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రధాన ఆకాంక్షలు నెరవేర్చాలంటే లోక్సభలో బీజేపీకి 370 సీట్లు కావాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాము అభివృద్ధిపైనే దృష్టి పెట్టాము తప్ప.. ఇతర అంశాలపై కాదని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంతకుముందు అన్నారు.
రామమందిర నిర్మాణం కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న విషయాన్ని సురేంద్ర జైన్ గుర్తుచేశారు. ఈ అంశంపై వాళ్లు ఎలా వెనక్కి వెళ్తారని ఆయన ప్రశ్నించారు. గత ఎన్డీయే ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించలేదు కాబట్టే ఓటర్లు వాళ్లను తిప్పి పంపేశారని చెప్పారు. బీజేపీ నాయకులు తమ గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఆధ్యాత్మిక పెద్దలతో కూడిన కమిటీ ఒకటి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, రామమందిర నిర్మాణం గురించి ఆయనకు విజ్ఞప్తి చేయాలని సురేంద్ర జైన్ కోరారు. ఆయోధ్యలో మందిరం గురించి కూడా నరేంద్రమోదీ తన 'మన్ కీ బాత్'లో చెప్పాలని బీజేపీ మిత్రపక్షం శివసేన ఇటీవల డిమాండు చేసిన నేపథ్యంలో విహెచ్ పీ కూడా ఈ డిమాండ్ ను తెరమీదకు తీసుకోచ్చింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more