టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి వ్యవహారంలో ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అందరినీ రెచ్చగొడుతున్నారన్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎవరిని ఎవరు రెచ్చగొట్టినా చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. పోన్లను ట్యాప్ చేయాల్సిన ఖర్మ మాకు లేదని....చంద్రబాబు ఆలోచనలు తమపై రుద్దుతున్నారని తలసాని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఎవరూ తప్పు చేసినా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఓ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి బేరసారాలు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. కళ్లముందు వ్యక్తి పట్టుబడినా.. ఇంకా కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు.
రాజకీయాలల్లో డబ్బును సృష్టించింది చంద్రబాబే అనేది జగమెరిగిన సత్యం అన్నారు. టీడీపీలో 25 సంవత్సరాలుగా పోరాటం చేసింది తానేని మంత్రి తెలిపారు. నోటుకు ఓటు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును వదమని తెలిపారు.చంద్రబాబు, రేవంత్ల విషయంలో తమ ప్రభుత్వంపై ఒత్తిళ్లు, ప్రభావాలు పని చేస్తున్నాయంటూ కొన్ని పత్రికలు పనిగట్టుకొని రాస్తున్నాయని.. అది వాస్తవం కాదని తెలిపారు. బాబుపై చట్ట పరిధిలో చర్య లు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి భయపడదని తేల్చి చెప్పారు.
ఈ కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఇలా పట్టుబడి ఉంటే కొన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు సంబంధిత ఎమ్మెల్యే, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురించి పుంకాలు పుంకాలుగా చరిత్రలు రాసేవారు కాదా..? వారెందుకు ఇప్పుడు ఏమీ జరగనన్నట్టుగా.. ఈ ఓటుకు నోటు కేసు జరగనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ప్రమేయం లేదని స్పష్టమైనా ఆయనను ముద్దాయిగా చేసేలా కథనాలు ప్రచురించేవారు కాదా..? అని తలసాని నిలదీశారు. నవ్యాంధ్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సమైక్య రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవని తప్పించుకోజూస్తున్నారని.. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు ప్రశ్నిస్తే ..సాధ్యమేనని చంద్రబాబు ఒప్పుకున్నారా..? లేదా..? ఆయనే చెప్పాలన్నారు. రేవంత్ విషయంలో మీడియాలో క్లిప్పిం గ్లు రానంత వరకు మీసాలు మేలేసి కుట్రలు, ట్రాప్ చేశారని ప్రగల్భాలు పలికారని.. టీవీల్లో వీడియోలు ప్రసారం కాగానే బాబుకు దిమ్మదిరిగి పోయిందని తలసాని మండిపడ్డారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more