గత నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీకి తగులుతున్న దెబ్బల మీద, విమర్శల మీద తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా విమర్శించారు. ఆయనో చరిత్ర హీనుడని అన్నారు. వైసీపీ చేస్తున్న విమర్శలకు తాను భయపడనని, బుల్లెట్ గా దూసుకువెళతానని చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణ హోంమంత్రి తనపై కేసులు పెడతామంటున్నారని, తనను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జిల్లాలోని చేబ్రోలులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. టీటీడీపీ నేత రేవంత్ కేసులో బాబే సూత్రధారి అన్న తెలంగాణ హోంమంత్రి నాయిని వ్యాఖ్యలపై బాబు ఘాటుగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కేబినెట్లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందురోజు టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఇంట్లో ఉంచారని ఆరోపించారు. దమ్ముంటే ముందు మీ సీఎంపై కేసు పెట్టాలని నాయినికి సూచించారు.
మరో పక్క ఎన్నికల హామీల మీద చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సమైక్య రాష్ట్రం ఉండేదని, అప్పుడు తాను సమైక్య రాష్ట్రంలోనే హామీలు ఇచ్చానని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని, ఆ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నింటినీ ఇప్పుడు నెరవేర్చడం కష్టమని ఆయన చెప్పారు. అప్పటి పరిస్థితలు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరే అంటూ క్లారిటీ ఇచ్చుకున్నారు. మీరు నామీద నమ్మకం పెట్టుకున్నారు. నేనైతేనే చేయగలనని నమ్మి ఓట్లేశారు. ఒకటి కాదు, రెండు కాదు, నేను ఆ రోజు చాలా హామీలు ఇచ్చాను. ప్ర.జలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. కాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై అప్పుడే విమర్శల వర్షం కురుస్తోంది. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందే అంటూ మండిపడుతున్నారు విపక్షపార్టీ నేతలు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more