ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న నానుడి చాలా మందివినే ఉంటారు.అయితే ఒకే సెన్సేషన్ న్యూస్ తో ఇద్దరు వ్యక్తులు పాపులర్ అయితే ఎలా ఉంటుంది. అది తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాలయలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి.. ఏసీబీకి దొరికిపోయారు. అలా ఎవరికైతే డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించారో ఆ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఒకే దెబ్బతో మీడియాలో బిగ్ షాట్ గా నిలిచారు. అప్పటి దాకా కనీసం ముఖ పరిచయం, పేరు కూడా పరిచయం లేని స్టీఫెన్ సన్ ఒక్కసారిగా మీడియాలో పాపులర్ అయ్యారు. ఎవరా.. స్టీఫెస్ సన్ అని అందరూ ఆరా తీసేంతగా హాట్ టాపిక్ గా మారారు. నామినేటెడ్ ఎమ్మెల్యేగా తెలంగాణ ప్రభుత్వంలో భాగంగా ఉంటున్నారు స్టీఫెన్ సన్. నిన్నటి పరిణామాలు జరిగిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి వచ్చిన స్టీఫెన్ సన్ కు ఘన స్వాగతం లబించింది. అందరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అతన్ని అబినందించారు.
ఇక ఏసీబీ వలలో చిక్కిన రేవంత్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ సర్కార్ మీదనో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీదనో ఆరోపణలు చేస్తూ మీడియాలో తరుచూ కనిపిస్తుంటారు అయితే నిన్నటి స్టింగ్ ఆపరేన్ తర్వాత రేవంత్ రెడ్డి మీడయాలో హాట్ టాపిక్ గా మారారు. ఇక సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మీద విమర్శలు లాంటి వాటితో ట్రెండింగ్ న్యూస్ గా మారారు. ఇక ఓటు వెయ్యడానికి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఘన స్వాగతం లభించింది. అటు తెలంగాణ టిడిపి నాయకులు అలానే బిజెపి నాయకులు రేవంత్ ను పలరించడానికి ఏకంగా క్యు కట్టారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఒకే ఇన్సిడెంట్ ఇద్దరిని హీరోలుగా చేసింది. మరి ఇంత విషయంలో జీరోలు ఎవరయ్యా..? అంటే దానికి సమాధానం ఎవరి దగ్గరా లేదు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more