సామాన్యులకు జీవిత రహస్యాలను తెలిపే అతీతశక్తులున్న స్వామీజీలో మన దేశంలో ఎందరో వున్నారు. వారిని ప్రజలకు కూడా పూర్తి విశ్వాసాలతో పూజిస్తుంటారు. అయితే అదే అదనుగా ఎందరెందరో దోంగ స్వామీజీలు కూడా పుట్టుకోస్తున్నారు. ఎవరు మహిమాన్వితులు.. ఎవరు మసి పూసి మారేడు కాయను చేస్తున్నారన్న తెలుసుకోవడం చాలా కష్టమే అయినా.. అలా తెలుసుకోలేక ఎందరో వారి బారిన పడి కొందరు నిలువుదోపిడికి గురవుతుండగా, మరికోందరు అడ్డంగా బుక్ అవుతుంటారు. సరిగ్గా ఇలాంటి దొంగ స్వామీజి బండారమొక్కటి ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ మధుర జిల్లాలో భట్టభయలు అయ్యింది.
అయితే అక్కడ బాధితురాలు అడ్డంగా బుక్ అయిన తరువాతగాని వాడు త్రాష్ఠుడని తెలియలేదు. వివరాల్లోకి వెళ్తే.. వితంతువుపై స్వామిజీతోపాటు అతని స్నేహితుడు తనను ఉత్తరప్రదేశ్ మధురకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. ఘజియాబాద్కు చెందిన మహిళకు గత కోంత కాలం క్రితం భర్తను కోల్పోయింది. దాంతో ఆమెను కష్టాలు చుట్టుముట్టాయి. తనకు తెలిసిన ఓ స్వామిని కలిస్తే కష్టాలు తొలగిపోతాయని ఓ వ్యక్తి సదరు మహిళతో నమ్మ బలికాడు. దీంతో ఆమె స్వామిజీని కలిసింది. కష్టాలు తొలగించాలని ఆమె స్వామిజీని వేడుకుంది. మదురకు వస్తే మీ కష్టాలను తొలగించి.. జీవితాంతం సుఖంగా వుండేలా చేస్తానని సదరు స్వామీజి అమెతో నమ్మబలికాడు.
ఈ క్రమంలో కష్టాలు తొలగిపోతాయని నమ్మకంతో సదరు వ్యక్తితో కుమారుడిని వెంటబెట్టుకుని బాధితురాలు మధుర వెళ్లింది. ఆ ఆ క్రమంలో పూజలు చేయాలన్న ఆమెపై స్వామిజీ అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమెతో వచ్చిన వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు వెళ్లడిస్తే కుమారుడిని చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. అయినా వారి బెదిరింపులను లెక్కచేయకుండా బాధితురాలు స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more