జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఏఐఏడిఎంకె అధినేత్రి జయలలిత ఈ ఉదయం11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జయలలిత చేత గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయిస్తారు.నిన్న సిఎం పదవికి పన్నీర్సెల్వం రాజీనామా చేయడంతో ప్రమాణ స్వీకారానికి జయలలితను గవర్నర్ రోశయ్య ఆహ్వానించారు. గవర్నర్ పిలుపుతో రాజ్భవన్కు వెళ్లిన జయలలిత తనతోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు రాజ్భవన్ వరకూ ఆమెను అనుసరించారు. 217 రోజుల తర్వాత మొదటిసారిగా ఆమె దర్శనమిచ్చారు.దాదాపు 8 నెలల అనంతరం ఆమె తమిళనాడు సిఎంగా మరోసారి పదవి చేపడుతున్నారు. రూ.66.66 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సెప్టెంబర్ 27న ప్రత్యేక కోర్టు జయలలితకు శిక్ష విధించడంతో సిఎం పదవికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
జయ సారథ్యంలో కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వంలో ముగ్గురు మినహా పాత మంత్రులే కొనసాగనున్నారు. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రులుగా ఉన్నవారిని అలాగే కొనసాగించేందుకు ఆమె మొగ్గుచూపారు. ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేయనున్నారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more