ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఎనిమిది సంవత్సరాల చిన్నారికి అభయమిస్తున్నారు. నీకు భయం లేదు బాలిక.. నేనున్నా అంటూ వెన్నంటి నిలుస్తున్నారు. ఓ ఎనిమిదేళ్ల ఓ చిన్నారి తనను బతికించండి అంటూ వేడుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తానే స్వయంగా లేఖ రాసింది. వివరాల ప్రకారం... ఆగ్రాలోని మంటోలా ప్రాంతానికి చెందిన మోహద్ ఖలీద్ కుమార్తె తయ్యాబా (8) అన్వారి నీలోఫర్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటుంది. ఆమె తండ్రి ఆగ్రాలోని చెప్పుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవలే తయ్యాబా గుండెకు రంధ్రం ఉందని తెలిసింది. ఢిల్లీ ఆసుపత్రిలోని డాక్టర్లు తయ్యాబాకు ఆపరేషన్ చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో తయ్యాబా కుటుంబ సభ్యులకు ఏమీ పాలుపోలేదు.
అప్పుడే ఆ చిన్నారికి ఓ ఆలోచన తట్టింది. ప్రధాని నరేంద్రమోడీకి తనను కాపాడాలని వేడుకోవాలనుకుంది. ఈ మేరకు గుండెజబ్బుతో బాధపడుతున్న తనను కాపాడాలని, చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా సహాయం చేయాలని వేడుకుంటూ ప్రధానికి లేఖ రాసింది. ఆ లేఖలో "నా హృదయానికి రంధ్రం ఉంది. నా ఆపరేషన్ కోసం మా నాన్న దగ్గర డబ్బు లేదు. ప్రధాని అందరికోసం పనిచేస్తారని చెప్పడం టివి ద్వారా తెలుసుకున్నాను. నేను బతికేందుకు అర్హురాలిని" అని పేర్కొంది. ఈ లెటర్తో వెంటనే స్పందించిన ప్రధాని కార్యాలయం... పాప ఆపరేషన్ కోసం ఢిల్లీలోని జెపి పంత్ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరిస్తుందని భరోసానిచ్చింది. లెటర్ పంపిన కొద్ది రోజులకే ప్రధాని నుంచి బదులు వచ్చిందని, ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేసిన ప్రధానికి తయ్యాబాతో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి మోదీ గారు ఆ చిన్నారిని ఆదుకోవడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more