పాకిస్థాన్ పరిస్థితి తెలుసుగా ఎలా జరిగిందో.. అందుకే అతివాదం, తీవ్రవాదాలను వీలైనంత దూరంగా ఉంచాలి అంటూ ప్రధాని నరేంద్రమోదీ చైనాలొ పిలుపునిచ్చారు. ఏ దేశానికైనా ఈ రెండు అంశాలు శత్రువులుగా తయారయ్యాయని మోదీ వ్యాఖ్యానించారు. భారత్తోపాటు చైనా దేశానికి కూడా అతివాదులు, తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి వుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ రెండు దేశాలు సరిహద్దు తీవ్రవాదం సమస్యను ఎదుర్కొంటున్నా యన్నారు. ఇరు దేశాల భద్రత, అభివృద్ధి అంశాలపై అస్థిత్వ పరిస్థితుల ప్రభావం పడుతోందని అన్నారు. అతివాదం, తీవ్రవాదం వల్ల చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ను మోడీ ఉదహరించారు. రెండు రకాల ఉగ్రవాదాలు ఒకే చోట నుంచి బయలుదేరుతున్నాయని పేర్కొన్నారు. సరిహద్దు తీవ్రవాదం సమస్యతో భారత్, చైనా ఇబ్బందిపడుతున్నాయని, ముంబయి, సిజియాంగ్ ప్రావిన్స్లలో తీవ్రవాద ఘటనలకు పాల్పడ్డవారు పాకిస్తాన్లో శిక్షణ పొందారన్న విషయం గుర్తించాలన్నారు. తరుచూ రూపాన్ని మార్చుకుంటున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలన్నారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, మోడీల మధ్య సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన విడుదల అయింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ఖండిస్తున్నామని, కౌంటర్-టెర్రరిజం ద్వారా తుదముట్టించాల్సిందేనని, దీనిపై పరస్పరం సహకరించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని అరికట్టడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని, తీవ్రవాదులకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడంలో దేశాలన్నీ నిజాయితీగా పనిచేయాలని ప్రపంచ దేశాలకు సూచిం చారు. చైనా ప్రధానితో జరిగిన సమావేశంలో మోడీ మాట్లా డుతూ, కేవలం ద్వైపాక్షిక సంబ ంధాల బలోపేతమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా ఇరు దేశాల మధ్య సహకారం పెరగాలని అన్నారు. ఇరు దేశాల అభివృద్ధిలో ఇది కీలకాంశం కానుందన్నారు. ఈ చైనా పర్యాటకులకు ఈ-వీసాలు మంజూరు చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more