ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. అయినా ఓ కేంద్ర మంత్రి మాత్రం ప్రత్యేక హోదా ఇస్తాం కానీ ఎప్పుడు అని మాత్రం చెప్పడానికి లేదు అని అంటున్నారు. ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరు అనుకుంటున్నారా.. కేంద్ర పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్. మాట తప్పం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం. కానీ, అందుకు కొంత సమయం పడుతుంది. ఇప్పుడా? ఏడాదికా? రెండేళ్లకా? అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేం అని ఆమె అన్నారు. ఏపికి ప్రత్యేక హొదా కుదరదు అని పార్లమెంట్ లో చెప్పినా కానీ.. ప్రత్యేక హోదా ఇవ్వబోమని బీజేపీ ఎక్కడా చెప్పలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. వాస్తవంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తమకు ఇబ్బందులు వస్తాయని, తమ రాష్ట్రాలనుంచి పరిశ్రమలు వెళ్లిపోతాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాలు మోకాలడ్డుతున్నాయని ఆమె చెప్పారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా తమకూ ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూడాల్సి ఉంటుందని, ఈ దశలో ఏకంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించలేమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే దీనిపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి ఎంపీలుగా అందరూ కష్టపడుతున్నాం.. కానీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా మాటల కన్నా, ప్రతిపక్షం కాంగ్రెస్ మాటలనే మీడియా ప్రసారం చేస్తోందని అన్నారు. బీజేపీ కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేశామన్నది చెప్పినా పత్రికలలో ఒక మూల ఓ చిన్న ఐటమ్ పడేస్తున్నారు అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు. మొత్తానికి అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు నిర్మలా సీతారామన్ మీడియా మీద మండిపడింది. ప్రత్యేక హోదా సీరియల్ ఇంకా అయిపోలేదని అంటోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more