పార్టీలో కార్యకర్తలే టీడీపీకి బలమని, తెలుగుదేశం పార్టీని ఏ శక్తి అడ్డుకోలేదని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీకి ఇంత బలం ఇచ్చిన కార్యకర్తలకు పాదాభివందనమని ఆయన అన్నారు. గురువారం పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ నాపై ఎంత ఒత్తిడి వచ్చినా రాష్ట్ర విభజనకు పార్టీ తరఫున లేఖ ఇచ్చారని అన్నారు. టీడీపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. టీడీపీ రాకముందు తెలంగాణ అభివృద్ధి జరగలేదని, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కూడా మేమే అని, హైదరాబాద్తోనే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని అని చంద్రబాబు తెలిపారు.
2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే అని ఆయన అన్నారు. నేతల వలసలను ప్రస్తావించిన చంద్రబాబు ఒక్క నాయకుడు పోతే వందమందిని తయారు చేసే సత్తా టీడీపీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. గురువారం పాలమూరుకు చేరుకున్న చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పసుపుమయం అయింది.
రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయని, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నా జీవితంలో పాలమూరు జిల్లాలను మరిచిపోలేనని ఆయన అన్నారు. పాలమూరు కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉన్నానని, పార్టీలో ఒకరిద్దరు నాయకులు పోతే వంద మంది నాయకులను తయారుచేసే శక్తి టీడీడీకి ఉందని ఆయన అన్నారు. ప్రజలు, కార్యకర్తల కోసమే బతుకుతున్నానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరిస్తామని అయన అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని... పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వేరే పార్టీలు మన నేతలను అరువు తీసుకున్నారని బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తల బాబోగులు చూసుకునే బాధ్యత నాదే అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more