ప్రధాని నరేంద్ర మోదీ బ్యాచిలర్ గా ఉంటున్నాడు అని అందరికి తెలుసు. అయితే బ్యాచిలర్ లైఫ్ లో ఉన్న మోదీ ఫ్యామిలీకి సమయం కేటాయించాలని, ఎప్పుడూ ఆఫీసు, ఫైళ్లు అని కాకుండా కుటుంబ సభ్యులకు టైం కేటాయించాలని సలహా ఇచ్చారు. ఇంతకీ ఎందు్కు ప్రధాని అన్నారనుకున్నారు.. అలా ఫ్యామిలీతో గడిపిన తర్వాత టెన్షన్ లేకుండా పోతుంది కాబట్టి ఆఫీసులో పని ఫాస్ట్ గా జరిపొతుందని మోదీ ప్లాన్. తొమ్మిదో సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో సివిల్ సర్వీసు అధికారులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో అధికార యంత్రాంగం విధుల్లో రాజకీయ మధ్యవర్తిత్వం తప్పనిసరని అయితే జోక్యం చేసుకోవడం మాత్రం తగదని పేర్కొన్నారు. మంత్రులు మౌఖికంగా ఇచ్చే ఆదేశాలను అనుసరించవద్దు. నిజాయతీగా పనిచేయండి. మిమ్మల్ని కాపాడుతానని ప్రధాని హామీ ఇచ్చారు.
సివిల్ సర్వీసు అధికారులు ఏడాదికొకసారి విద్యార్థులతో సమావేశం కావాలని దిశానిర్దేశం చేశారు. ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబ సభ్యులతో గడపడానికీ సమయం కేటాయించాలని, రోబోటిక్ జీవితాన్ని గడపొద్దని అధికారులకు సూచించారు. యాంత్రికంగా జీవించడం మొదలు పెడితే.. దాని ప్రభావం ప్రభుత్వం పైనా వ్యవస్థపైనా పడుతుందన్నారు. మానవీయతను ఎట్టిపరిస్థితుల్లో కోల్పోరాదన్నారు. మధ్యవర్తిత్వం వహిస్తే పనుల్లో వేగం పెరుగుతుందని మోదీ వివరించారు. సామర్థ్యాన్ని నిర్మించడమే నేడు మనం ఎదుర్కొంటున్న పెద్ద సవాలని ఆయన పేర్కొన్నారు. జవాబుదారీతనం, బాధ్యత, పారదర్శకత అనేవి లేకపోతే సుపరిపాలన అసాధ్యమన్నారు. ఆయన దీనిని ఆర్ట్(అకౌంటబిలిటీ, రెస్పాన్స్బిలిటీ, ట్రాన్స్పరెన్సీ)గా అభివర్ణించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more