నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన సిమి ఉగ్రవాదులు అస్లాం అయూబ్, ఎజాజుద్దీన్లు గుంటూరు, విజయవాడ నగరాలను టార్గెట్ చేశారా? అందుకు పోలీసు నిఘాకు దూరంగా ఉండేలా మెదక్ జిల్లా సంగారెడ్డిలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారా? అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు సిమి ఉగ్రవాదులు అస్లాం, ఎజాజ్లు గత ఏడాది అక్టోబర్లో మరో ముగ్గురు విచారణ ఖైదీలతో కలిసి మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి పారిపోయారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే అందులో ఇద్దరు ఖైదీలు పోలీసులకు పట్టుబడ్డారు. అప్పటినుంచి దేశవ్యాప్తంగా తిరుగుతున్న అస్లాం, ఎజాజ్లు ఇటీవల తెలంగాణలో అడుగుపెట్టారు. ఇలా వీరు ముఠాగా ఏర్పడి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు, మెదక్ జిల్లా రామచంద్రాపురంలో బంగారం కుదువపెట్టుకుని రుణాలిచ్చే ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో చోరీలకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కళ్లుకప్పి కొంతకాలంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరో ఇద్దరు కూడా వీరి బృందంలో చేరారని కనుగొన్నారు. సంగారెడ్డి కేంద్రంగా విజయవాడ, గుంటూరులో బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్లాన్ అమలు చేసేందుకు వెళ్తూనే ఈనెల ఒకటో తేదీన అర్ధరాత్రి సూర్యాపేట బస్టాండ్లో తనిఖీలు జరుపుతున్న పోలీసుల కంటపడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వారిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో దుండగులు మృతిచెందిన విషయం తెలిసిందే. సూర్యాపేటలో పోలీసుల కంటపడక ముందే మార్చి 28 నుంచి 30 తేదీల్లో దుండగులు విజయవాడ, గుంటూరులో పర్యటించినట్లు సమాచారం. అక్కడ దోపిడీకి అనువుగా ఉన్న పలు బ్యాంకుల్లో రెక్కీ సైతం నిర్వహించి ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది. ఆంధ్ర కొత్త రాజధాని విజయవాడ- గుంటూరు పరిసర ప్రాంతాల్లో నిర్ణయించడంతో ఈ మధ్యకాలంలో అక్కడ కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. అందుకే దుండగులు ఆ రెండు పట్టణాలను టార్గెట్ చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెక్కీ పూర్తి చేసిన అనంతరం తిరిగి సంగారెడ్డికి చేరుకుని ఆయుధాలతో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలోనే సూర్యాపేటలో పోలీసుల కంటపడడంతో ప్లాన్ అడ్డం తిరిగి ఎన్కౌంటర్లో మృతిచెందారు. సూర్యాపేటలో పోలీసు తనిఖీల్లో దుండగులను గుర్తించకుంటే విజయవాడ, గుంటూరు జిల్లాల్లో బ్యాంకు దోపిడీకి పాల్పడి ఉండేవారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more