ఇటీవలే దేశవ్యాప్తంగా కార్ల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజురోజుకు దొంగతనానికి గురవుతున్న కార్ల బాధితుల సంఖ్య మరింత పెచ్చుమీరిపోతున్న సమయంలో నిందితులను ఆటకట్టించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే.. ఈ విచారణలో భాగంగానే కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్ల దొంగతనాల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూమీనాథ్ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. అసోం, మహారాష్ట్ర, న్యూఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో అతి సునాయాసంగా కార్లను-ఆటోలను దొంగిలించడంలో అనిల్ చౌహాన్ బాగానే పేరుగడించాడు. ఆ దొంగలించిన వాహనాలను తన పేరుతో రిజిష్టర్ చేసుకొని, తప్పుడు రికార్డులతో అమ్ముకోవడం అతనికి అలవాటు! ఈ నేపథ్యంలో అతనికి అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించేందుకు కారు పాస్లు మంజూరు చేశారు. ఈ పాస్ లను మంజూరు చేయడంలో MLA రూమీ సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఆమె అతని దగ్గర ఒక విలువైన కారును కొన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలోనే ఈ దొంగతనాల కేసులో ఈమె హస్తం వుందన్న అనుమానంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కార్లను దొంగతనం చేయడంలో నిందితులకు సహకరించారని గతకొన్నాళ్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రుమీనాథ్.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు కూడా! అయితే గత శుక్రవారం గౌహతి హైకోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించడంతో అరెస్టు తప్పలేదు. అటు ఈ సంచలన కేసులో రూమీనాథ్ రెండో భర్త జాకీ జకీర్, ఆమె వ్యక్తిగత భద్రతా అధికారి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పుడు ఆమెను కూడా అరెస్టు చేశామని, బుధవారం నాడు కోర్టులో ప్రవేశపెడతామని ఏసీపీ లాల్ బారువా చెప్పారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా అసోం కాంగ్రెస్ పార్టీ రూమీ నాథ్ కు షోకాజ్ నోటీసు ఇచ్చింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more