తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం ఎర్రచందనం దొంగలను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపిన విషయం తెలిసిందే! అయితే.. ఈ ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే తమిళనాట తీవ్ర నిరసనలు పెల్లుబికాయి. తమిళనాడు సీఎం దీనిమీద సమగ్రంగా విచారణ జరిపించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. మరోవైపు నిరసనకారులు ఏపీ నుంచి అటు వెళ్లే వాహనాలపై దాడికి పాల్పడుతున్నారు. అలాగే హెరిటేష్ ఫ్రెష్ లపై దాడికి పాల్పడుతున్నారు. మొత్తానికి ఈ విషయం రచ్చరచ్చగా మారింది.
ఇదిలావుండగా.. పోలీసులు జరిపిన ఈ ఎన్ కౌంటర్ లో తన భర్త మృతి చెందడంపై అనుమానాలున్నాయని, వాస్తవాలు వెలికి తీసేందుకు మరోసారి పోస్టు మార్టం నిర్వహించారని ఓ బాధితురాలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఎన్ కౌంటర్ లో మృతిచెందిన కూలీలకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించి, వాస్తవాలు బాధితులకు తెలియజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారం వరకు మృతదేహాలకు అంత్యక్రియలు జరపొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆరుగురి మృతదేహాలకు రేపటి (శుక్రవారం) వరకు అంత్యక్రియలు జరగకుండా ఆగిపోనున్నాయి.
మరోవైపు.. ఈ ఎన్ కౌంటర్ వ్యవహారం సుప్రింకోర్టు వరకు వెళ్లింది. తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి అనే న్యాయవాది సుప్రింకోర్టులో ప్రస్తావన వేశారు. బాబు, డిజిపి కుమ్మక్కై ఈ ఎన్ కౌంటర్ చేయించారని.. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలిపినట్లు కృష్ణమూర్తి తెలిపారు. గతంలో కొన్ని నకిలీ ఎన్ కౌంటర్ల విషయంలో సుప్రింకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో శేషాచలం అడవులలో జరిగిన ఎన్ కౌంటర్ కు ప్రాముఖ్యత ఏర్పడింది. మరి.. కోర్టు ఈ సారి ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందో చూడాలి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more