గవర్నర్ గారికి చిర్రెత్తినట్లుంది అందుకే నేనేం ఖాళీగా కూర్చోలేదు అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అంటే తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్ నరసింహన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే గవర్నర్ నరసింహన్ కాస్త అసహనంగా ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంట్రీ ట్యాక్స్ వివాదానికి గవర్నరే కారణమంటూ కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా గవర్నర్ మార్పు జరుగుతుంది అని రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏదో కోపంలో అన్నారో లేక మనసులో ఉన్న మాట అన్నారో తెలియదు కానీ గవర్నర్ తను ఏం చేస్తున్నాడో చెప్పుకొచ్చారు.
రాజ్ భవన్ లోఖాళీగా కూర్చోనని తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఎంట్రీ ట్యాక్స్'పై ఏపీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య అంతర్గత సంభాషణ చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలు తనకు తెలుసునని కాంగ్రెస్ నేతలతో గవర్నర్ అన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడిన మొదటి గవర్నర్ ను తానేనని చెప్పారు. ప్రజల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడానని గుర్తు చేశారు. తానేం చేశానో ప్రజలకు తెలుసునని, అందరికంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తానని అన్నారు. ఏం చేసినా ఆలోచించి నిజాయితీ పనిచేశానని చెప్పారు. ఒకరితో చెప్పించుకునే రానీవ్వనని గవర్నర్ పేర్కొన్నారు.
మొత్తానికి మరో వారంలో గవర్నర్ పోస్ట్ ఊస్ట్ అంటూ మీడియాతో పాటు ప్రజల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడంతో గవర్నర్ నరసింహన్ విఫలమవుతున్నారని కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణకు మేలు చేసేలా, ఏపికి ఇబ్బంది కలిగేలా గవర్నర్ వ్యవహరించారని పుకారు. మరి ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు గవర్నర్ నరసింహన్ కోపానికి ఎన్ని కారణాలు ఉన్నాయో. ఏది ఏమైనా తాను ఏం చేశానో ప్రజలకు తెలుసు అని రాజకీయ నాయకుడిలా ఓ డైలాగ్ విసిరారు గవర్నర్. అయినా గవర్నర్ ఏం చేసినా.. గవర్నర్ పోస్ట్ ఊడే టైం వస్తే ఊడిపోతుంది అని కూడా కొంత మంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more