ప్రధాని నరేంద్ర మోదీ గురించి అందరికి తెలుసు. మీడియాకు ఎంత ప్రధాన్యం ఇస్తారో కూడా తెలుసు. మీడియా ద్వారా ఎప్పుడు వార్తల్లో ఉండే ప్రధాని నరేంద్ర మోదీ టీవీల్లో వస్తున్న వార్తలకు సంబందించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కనీసం గాసిప్ లు కూడా కాని విషయాలు ఏకంగా బ్రేకింగ్ న్యూస్ గా మారుతున్నాయని నరేంద్ర మోదీ మీడియాను ఉద్దేశించి అన్నారు. నిజానికి ఎప్పుడూ మీడియా ద్వారా వార్తల్లో నిలవాలనుకునే వాళ్లలో తాను ఒకడిని అని చెప్పారు. అయితే వార్తల విషయంలొ వార్తా సంస్థల్లో వచ్చిన మార్పును మోదీ విమర్శించారు.
గతంలో బ్రేకింగ్ న్యూస్ అంటే పక్కా సమాచారం తెలుసుకున్న తర్వాత కానీ వేసే వారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది పక్క ఛానెల్ లో వస్తే చాలు దానికి నాలుగు లైన్లు కలిపి బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేస్తున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో అయితే మరీ దారుణంగా ఉంటోంది. ఒకే యాక్సిడెంట్ లొ ఛానెల్ ఛానెల్ కు మృతుల సంఖ్య మారుతూ ఉంటుంది. ఉత్సాహంతో కొంత మంది మీడియా ప్రతినిధులు చేసే అతి కూడా ఇందుకు కారణం. మొత్తానికి కారణాలు ఏవైనా మీడియా మాత్రం కనీసం గాసిప్ లు కూడా కాని అంశాలను ఏకంగా బ్రేకింగ్ న్యూస్ గా చేస్తున్నాయని ప్రధాని మోదీ సున్నిసంతగా విమర్శించారు.
- అబినవచారి
(Source: indolink.com)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more