భారత్ మరో అత్యుత్తమ క్రీడల పండుగకు వేధికగా నిలవాలని భావిస్తోంది. ఇప్పటివరకు కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చిన భారత్.. తొలిసారిగా ఒలింపిక్స్కు కూడా ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిని చూపుతోంది.. 2024లో జరిగే ఒలింపిక్ క్రీడలను మన దేశంలో నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ గట్టిగా నిర్ణయించుకున్నారు.. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ దృష్టికి కూడా ఈ విషయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు నెలాఖరులో జర్మనీ పర్యటన చేయనున్న మోడీ.. తన పర్యటనలో భాగంగా బాచ్తో కూడా సమావేశమై దీనిపై ఆయన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాను ఇప్పటికే ఐఓసీ అధికారులను గత నెలలో కలిసి, 2024 ఒలింపిక్స్ విషయంలో ప్రాథమిక చర్చలు జరిపినట్లు క్రీడాశాఖ కార్యదర్శి అజిత్ శరణ్ నిర్ధారించారు. ఐఓసీ చీఫ్ బాచ్ కూడా భారత్ ఆతిథ్యం విషయాన్ని సీరియస్గానే పరిగణిస్తున్నారు. 120 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఎలా కాదనగలం అని కూడా ఆయన అన్నట్లు తెలుస్తోంది. 2024 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఈ ఏడాది అక్టోబర్ లోగా దరఖాస్తు చేయాలి. వాటిలోంచి కొన్ని నగరాలను ఐఓసీ 2016 మే నాటికి షార్ట్ లిస్ట్ చేస్తుంది. 2017 జూలైలో అధికారికంగా పేరు ప్రకటిస్తారు. ఈసారి భారతదేశానికి అవకాశం వస్తే, అహ్మదాబాద్ నగరాన్ని ఇందుకు వేదికగా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఈ విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more