బారతదేశ రాజధాని ఢిల్లీలో ఓ యాక్సిడెంట్ అయింది. అయితే యాక్సిడెంట్ లో ఎవరూ గాయపడలేదు. కానీ యాక్సిడెంట్ అయిన కారు గురించి మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు అనేగా ప్రశ్న. అది మామూలు కారు కాదు ఏకంగా నాలుగు కోట్ల కారు. మరి నాలుగు కోట్ల కారు అలా యాక్సిడెంట్ లో నుజ్జునుజ్జు అయింది. ఇంతకీ ఆ కారు ఎవరిది, ఎలా యాక్సిడెంట్ అయిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..
ఢిల్లీ అంటేనే బారత్ కు అద్దంలాంటిది. అన్ని రకాల వాతావరణం అక్కడ ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా యాక్సిడెంట్ లు ఎలా జరుగుతాయో ఢిల్లీలో కూడా యాక్సిడెంట్ లు ఎక్కువగానే జరుగుతాయి. అయితే ఇండియా గేట్ దగ్గర డివైడర్ ను ఢీ కొట్టిన ఓ కారు బోల్తా పడింది. కారు మొత్తం పీస్ పీస్ అయింది. కాగా కారులో ఉన్న వారికి మాత్రం ఏ ప్రమాదం జరగలేదని పోలీసులు నిర్దారించారు. అయితే రోజూ ఎన్నో యాక్సిడెంట్ లు అవుతుంటాయి. మరి వాటికి ఇవ్వని ప్రాధాన్యత ఈ కార్ యాక్సిడెంట్ కే ఎందుకు అంటే కారు ఖరీదు అక్షరాల నాలుగు కోట్లు. ల్యాంబోర్గిని కంపెనీకి చెందిన ఆ కారు ఖరీదు అక్షరాల నాలుగు కోట్లే. అది కూడా రేర్ వీల్స్ కలిగిన కారు. అయితే కార్ యాక్సిడెంట్ తర్వాత కార్ కు సంబందించిన వ్యక్తులు ఎవరూ అక్కడ కనిపించకపోవడంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి కార్లు 26 రిజిస్టర్ అయ్యాయని, వాటి డాటా ద్వారా కార్ ఎవరిదో కనిపెడతామని పోలీసులు వెల్లడించారు. అయితే పాత కార్ అయితేనే మనం వదిలిపెట్టం మరి అలాంటిది నాలుగు కోట్ల కారంటే వదులుతామా.. సరే కారు మనది కాక పోయినా కనీసం చూడడానికైనా ముందుంటాం.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more