క్రికెట్ సామాజ్రాన్ని ఏలిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. అయితే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ ఏపిలోని పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం అందరికి తెలిసింది. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల్లో భాగంగా ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, దాన్ని ఆదర్శగ్రామంగా మార్చాలి. అయితే దాదాపు అందరు ఎంపీలు ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న కండ్రిగ గ్రామాంలో స్పష్టమైన మార్పు కనిపిస్తూ ఉంది. సచిన్ గ్రామాభి వృధ్దికి చేస్తున్న కృషికి గ్రామస్తుల నుండి అభినందనల వెల్లువసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని ప్రముఖ క్రీడాకారుడు, ఎంపీ సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్నారు. అప్పటి దాకా కనీసం ఊరు గురించి తెలియదు కానీ సచిన్ దత్తత తో ఒక్క సారిగా వార్తలకెక్కింది. పుట్టంరాజుకండ్రిగ గ్రామంలో కేవలం 390 మంది మాత్రమే నివసిస్తున్నారు. మొత్తం 110 కుటుంబాలు ఉన్న ఈ గ్రామం చెన్నై కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనీసం రవాణా సదుపాయం కూడా లేకుండా నిన్నటి దాకా గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. కరెంట్ కష్టాలు, తాగు నీటి సమస్యలు, తగిన టాయ్ లెట్ లు లేక మహిళలు ఇలా మొత్తం సమస్యల వలయంలో చిక్కుకుంది కండ్రిగ గ్రామం. అయితే సచిన్ టెండూల్కర్ దత్తత తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం సిసి రోడ్లు గ్రామానికి చక్కటి రోడ్డు ప్రయాణానికి వీలు కల్పిస్తున్నాయి. తాగు నీటి వసతి కూడా మెరుగు పడింది. గతంలో కన్నా పరిస్థితి ఇప్పుడు చాలా మారిందని, ఆ మార్పులకు కారణం సచిన్ కృషి అని గ్రామస్తులు కితాబిస్తున్నారు. మొత్తానికి సచిన్ పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని ప్రగతిపథంలో నడుపుతున్నారు. ఆదర్శగ్రామంగా మార్చాలన్న ప్రధాని కలను నిజం చేసే పనిలో ఉన్నారు సచిన్. క్రికెట్ లో ఎంతో మంది అభిమానులు సంపాదించిన సచిన్, ఇప్పుడు సమాజ సేవలోనూ అందరి నుండి మెప్పు పొందుతున్నారు. ఎంతైనా సచిన్ గ్రేట్ కదా.. హ్యాట్సాఫ్ సచిన్.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more