ఈనెల 29వ తేదీన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’(మా) అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్, నటి జయసుధ తలపడుతున్నారు. అయితే.. ఈ పోటీలో నుంచి తప్పుకోవాల్సిందిగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని జయసుధ ఇటీవలే రాజేంద్రప్రసాద్ ప్యానెల్ పై విమర్శలు చేశారు. దీంతో ఈమెకు మద్దతుగా చాలామంది నటీనటులు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో రాజేందప్రసాద్ కి కాస్త వ్యతిరేకత ఎదురవుతోంది.
ఇదలావుండగా.. తాజాగా ఈ ఎన్నికల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అదేమిటంటే.. రాజేంద్రప్రసాద్ ప్యానల్ నుంచి ఉత్తేజ్, శివాజీరాజా పోటీ నుంచి తప్పుకున్నారు. రాజేంద్రప్రసాద్ ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ నామినేషనల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరు ఇంత సడెన్ గా ఈ ఎన్నికల నుంచి తప్పుకోవడం విశేషంగా మారింది. ఈ విషయంపై శివాజీరాజా పెదవి విప్పలేదుగానీ.. తాను మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తేజ్ తెలిపారు.
పోటీ నుంచి తప్పుకున్న అనంతరం ఉత్తేజ్ ఓ వార్త చానెల్ తో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన తన విత్ డ్రాన్ పై వివరణ ఇచ్చారు. పోటీ నుంచి తప్పుకోవడం వెనుక ఎలాంటి ఒత్తిడులు లేవని, కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను తప్పుకున్నానని ఉత్తేజ్ స్పష్టం చేశారు. అయితే.. నామినేషన్ల సమయంలో పరిస్థితి వేరు.. ప్రస్తుతమున్న పరిస్థితి వేరు అని చెప్పారు. ‘ఎందుకలా అనిపించింది?’ అని ప్రశ్నించగా.. ఆయన సమాధానాన్ని దాటవేశారు. తాను పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ కు తెలియజేశానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more