రసవత్తరంగా సాగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ కు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది. పిచ్ మీదే కాదు క్రికెట్ అభిమానుల ఆశలపై కూడా నీళ్లు చల్లింది. అయితే వర్షం కాస్త నెమ్మదించడంతో క్రికెట్ సమరానికి మరోసారి తెర లేచింది. అయితే న్యూజిలాండ్, సౌతాఫ్రికా మ్యాచ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ను వర్షం కారణంగా 43 ఓవర్లకే కుదించారు. అయితే ఇప్పటికే 38 ఓవర్ల మ్యాచ్ ఆడిన సౌతాఫ్రికా మరో ఐదు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. డి విలియర్స్ కు తోడుగా ముందు నుండి క్రీజ్ లో కొనసాగుతున్న ప్లీసిస్ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్లీసిస్ వికెట్ కోల్పోవడం కాస్త సౌతాఫ్రికా అభిమానులను నిరాశకు గురిచేసింది.
కానీ తరువాత వచ్చిన మిల్లర్ అద్భుత మైన బ్యాటింగ్ తో సౌతాఫ్రికా జట్టు స్కోర్ ను భారీ దిశగా పెంచారు. కేవలం 18 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో మిల్లర్ 49 పరుగులు చేసి మ్యాచ్ ను టర్న్ చేశారు. కోరి అండర్సన్ బౌలింగ్ లో మిల్లర్ 49 పరుగుల వద్ద ఔటయ్యారు. అంతకు ముందు వర్షానికి ముందు 216 పరుగులు చేసిన సౌతాఫ్రికా మిగిలిన ఐదు ఓవర్లలో ఏకంగా 281 పరుగులను చేసింది. 39 వ ఓవర్లో 6 పరుగులు, 40 వ ఓవర్ లో 17 పరుగులు, 41 వ ఓవర్లో ఏకంగా 20 పరుగులు, 42వ ఓవర్ లో 7 , చివరి ఓవర్ లో 15 పరుగులు చేసి సౌతాఫ్రికా 281 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక మ్యాచ్ లో ప్లీసిస్, డి విలియర్స్ రెచ్చిపోగా, మిల్లర్ మ్యాచ్ ను మరింత రసవత్తరంగా మార్చారు. చివరిగా బరిలోకి దిగిన డుమిని నాలుగు బంతుల్లో ఓ ఫోర్ ఎనిమిది పరుగులు చేశారు. ఏబి డివిలియర్స్ 65 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 298 పరుగుల భారీ లక్ష్యంతో బరలోకి దిగనున్న న్యూజిలాండ్ మరి లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ లో నిలుస్తుందా లేక మధ్యలోనే ఇంటిముఖం పడుతుందా చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more