రాజ్యాంగ ద్వారా నియమించబడి, రాజ్యాంగాన్ని పాటించాల్సిన వ్యక్తులు కూడా కొన్ని సార్లు వాటిని తుంగలో తొక్కుతున్నారు. భారతదేశంలోని ప్రతి భారతీయుడు జాతీయగీతాన్ని, జాతీయ జెండాను గౌరవించాలి. జాతీయ జెండాను కానీ జాతీయ గీతాన్ని కానీ అవమానించేలా భారతదేశంలోని ఏ ఒక్క వ్యక్తి ప్రవర్తించరాదు. కానీ రాజ్యాంగాన్ని అమలు చేసే కీలక బాధ్యతల్లో ఉన్న ఓ రాష్ట్ర గవర్నర్ జాతీయ గీతాన్ని అవమానించడం ఇప్పుడు వార్తలకెక్కింది.
కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా రాజ్ భవన్ లో జాతీయగీతాన్ని అవమానించేలా ప్రవర్తించారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ కర్ణాటక రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ వాజుభాయ్ వాలా హాజరయ్యారు. అయితే ప్రమాణ స్వీకారం తరువాత జాతీయ గీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. కానీ జాతీయగీతాన్ని అందరు పాడుతుండగా మధ్యలోనే గవర్నర్ సభ నుండి వెళ్లిపోయారు. దాంతో అక్కడే ఉన్న కర్ణాటక హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి డి.హెచ్.వాఘేలా తదితరులు ఆశ్చర్యపోయారు. గవర్నర్ తప్ప మిగిలిన వారంతా జాతీయగీతాన్ని గౌరవిస్తు లేచి, నిలిచి పాడుతుండగా గవర్నర్ వెళ్లి పోవడం తీవ్రం సంచలనానికి కారణమైంది. రాజ్ భవన్ లో జరిగిన ఘటనను అన్ని టీవి ఛానళ్లు ప్రసారం చేశాయి. దాంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాజ్యాంగబద్ద పదవిలో ఉండి, ఓ గవర్నర్ ఇలా ప్రవర్తించడం ఏంటని నిరసన వ్యక్తమవుతోంది. అయినా ఇప్పటి వరకు కూడా రాజ్ భవన్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more