ఎన్డీయే ప్రభుత్వం తీసుకు రావాలనుకున్న భూసేకరణ చట్టానికి ఆది నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయి. చివరకు భారతీయజనతాపార్టీ మిత్ర పక్షాలు కూడా బిల్లులో మార్పులు తీసుకు రావాలని, లేనిపక్షంలో మద్దతిచ్చేది లేదని తేల్చిపడేశాయి. కాంగ్రెస్, తృషముల్ కాంగ్రెస్, ఎన్సీపి, సమాజ్ వాది పార్టీ, బిఎస్పీ, టిఆర్ఎస్ ఇలా చాలా పార్టీలు ప్రభుత్వం తెస్తున్న భూసేకరణ బిల్లులో మార్పులు తేవాలని పట్టుబట్టాయి. అయితే కేవలం కార్పోరేట్ వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ప్రస్తుత బిల్లు ఉందని, దాన్ని మార్చాలనిఅన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్డీయే భాగస్వామి శివసేన కూడా ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోంది. మంగళవారం ఈ బిల్లు లోక్సభలో ఓటింగ్కు రానున్న నేపథ్యంలో శివసేన కూడా బిల్లులో సవరణలను సూచించింది.
అయితే కొన్ని సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సంకేతాలిచ్చారు. ప్రభుత్వం మొత్తం ఆరు సవరణలను ఈ బిల్లుకు ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయని వెంకయ్య చెప్పారు. సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూసేకరణలో మినహాయింపులు కల్పించే విషయం పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఐదేళ్లలో రైల్వేలైన్ల నిర్మాణం పూర్తిచేయాలన్నా భూ సేకరణ చట్టం అవసరమని ఆయన చెప్పారు. ఢిల్లీ-ముంబై కారిడార్, విశాఖ-చెన్నై కారిడార్లకు భూమి అవసరమని, ఛత్తీ్సగఢ్, ఆంధ్రప్రదేశ్ల్లో కొత్త రాజధానులకు భూమి అవసరమని గుర్తుచేశారు. భూసేకరణపై ఆర్డినెన్స్ను దాదాపు అన్ని రాషా్ట్రల అభిప్రాయాలకు అనుగుణంగానే జారీ చేశామని వివరించారు. భూసేకరణకు తగిన పరిహారం ఇవ్వడంలో రాజీపడేది లేదని, కొత్త బిల్లులో మరో 13 కేటగిరీలకు మినహాయింపునిచ్చి రైతులకు అధిక ప్రయోజనం చేకూర్చామని ఆయన చెప్పారు. అయితే.. తాము సూచించిన సవరణలు చేయకుంటే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాగా, భూసేకరణసహా పలు కీలక బిల్లులకు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉండటంతో ఉభయసభలో తమ సభ్యులంతా తప్పనిసరిగా ఈ వారమంతా సమావేశాలకు హాజరై తీరాలని బీజేపీ విప్ జారీచేసింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more