కీచకల పరంపర కొనసాగుతోంది. మహిళలపై మగమృగాళ్లు విలయతాండవం శృతి మించుతోంది. త్లల్లిగా, చెల్లిగా, భార్యగా ఆదరణకు నోచుకోవాల్సిన మహిళలపై అత్యాచార సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా మాకేం నేరాలు కోత్త కాదు అన్నట్లుగా మగమృగాళ్లు విరుచుకుపడుతున్నాయి. ఆకాశంలో సగం మగువలన్న అర్థం పోయి.. ఇంటి నుంచి అడుగు భయట పెట్టాలంటేనే మగువలు జంకాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.
తాజాగా ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఈ సంఘటన గురువారం కేపీహెచ్బీలోని వెంకటేశ్వరాకాలనీలో జరిగింది. వివరాలు.. వెంకటేశ్వర కాలనీకి చెందిన 38 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్, వెంకటేశ్, అత్యాచారం చేశారు. బాధితురాలు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
మరో ఘటనలో ఉత్తరప్రదేశ్లోని వృందావన్కు వచ్చిన 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. స్వతహాగా శ్రీష్ణుడి భక్తురాలైన కాలిఫోర్నియాకు చెందిన మహిళ ఫిబ్రవరి 26న హోలీ ఉత్సవాల కోసం వృందావన్కు వచ్చింది. స్థానికంగా వున్న ఓ గెస్టు హౌస్లో దిగింది. ఆ మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయిన మహిళ ఇవాళ తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయి, రోడ్డు పక్కన పడి వుంది. విధేశీ మహిళను గుర్తించిన పోలీసులు ఎస్కార్టు సాయంతో ఆమెను మధుర జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
తులసీ మాల ధరించిన ఓ సాధువు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తులసీ మాల ధరించిన ఓ సాధువును వెతికే పనిలో పడ్డారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి వర్గాలు ప్రస్తుతం ఆమె తీవ్రమైన షాక్ స్థితిలో ఉందని, తనపై జరిగిన దాడి కారణంగా చాలా భయపడిందని చెప్పారు. ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లు సూచించలేదని, మిగతా పరీక్షల నిమిత్తం ఆమెను ఆగ్రాకు పంపుతున్నట్లు తెలిపారు
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more