ఎన్నికల్లో ఎంత ఖర్చు చేసినా దానికి లెక్కలు ఉండాలి. భారత ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ప్రకారం అభ్యర్థులు ఖర్చు చెయ్యాలి. అలా కాదని ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు చేసినా ఎక్కిక చెల్లదు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నం. ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తారో వారికే విజయావకాశాలు ఎక్కువ అన్న భావన చాలా పార్టీలకు ఉన్నాయి. ఇక పార్టీలకు అందే విరాళాల లెక్కల ఎన్నికల కమీషన్ కు చూపించాల్సిందే. అన్ని జాతీయ పార్టీలు కోట్ల రూపాయల విరాళాలను సేకరిస్తున్నాయి. దానికి తగ్గట్టు డబ్బులకు తగిన లెక్కలను కూడా చూపుతున్నాయి.
తాజాగా ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిధులపై ఐటి నోటీసులు జారి చేసింది. ఈ ఎన్నికల సందర్భంగా పార్టీకి వచ్చిన డొనేషన్ల వివరాలను తెలపాలని కోరింది. ఈ నెల 16 లోగా తమ లేఖకు సమాధానం ఇవ్వాలని ఐటి లేఖలో పేర్కొన్నారు. అయితే ఆప్ కు వచ్చిన రెండు కోట్ల రూపాయలు అక్రమంగా వచ్చి చేరినవే అంటూ ఎన్నికల సందర్భంగా బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. ఎలాంటి వ్యాపార లావాదేవిలు లేదని కంపెనీల నుండి డబ్బు పార్టీకి చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్నే రేపాయి. కాగా బిజెపి కావాలనే ఐటి చేత నోటీసులు ఇప్పించిందంటూ అప్పడే విమర్శలూ వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more