రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాలకు పరిష్కారం చూపాల్సిన కేంద్రం స్పందించడం లేదు. పైగా మీరు మీరు చూసుకోండి మాకేం సంబందం లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది. కృష్ణానది జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ముందు ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం నుండి ప్రత్యేక అధికారులను పంపించాలని భావించినా, చివరకు ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
రెండు తెలుగ రాష్ట్రాలకు ముందు నుండి జలాలపైనే ప్రధాన వివాదం. అయినా అప్పటి యుపిఎ సర్కార్ వాటికి పూర్తి స్థాయి పరిష్కారాన్ని చూపించకుండా రాష్ట్ర విభజన చేసింది. దాంతో ఇప్పుడు రెండు రాష్ట్రాలు జలాలపై వాటాలను తమ రాష్ట్రానికి అనుకూలంగా లెక్కలతో చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే పరిమితికి మించి నీటిని వాడుకుందని ఇక మీదట ఒక్క నీటి బొట్టును కూడా కింద వదలబోమని తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో పక్క తెలంగాణ లేవనెత్తిన అంశాలు తప్పని వాదిస్తోంది ఏపి. న్యాయ బద్దంగా తమకు రావలసిన వాటాను మాత్రమే తాము వాడుకున్నామని ఏపి వివరిస్తోంది.
ఇలా ఏ రాష్ట్రం తమ వాదనలే సరైనవంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కృష్ణా జలాల యాజమాన్య బోర్డు మాత్రం ఎలాంటి చర్యలకు దిగడం లేదు. చర్చల ద్వారా వివాదాలకు తెర దెంచే ప్రయత్నమూ చెయ్యలేదు. పైగా మీ గొడవలు మీరే పరిష్కారించుకోవాలని ఉచిత సలహా ఇస్తోంది. తరువాతి పరిస్థితిపై ఈ నెల 130 కల్లా తమకు లేఖ రాయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ప్రకటన చెయ్యలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వివాదాన్ని వివరిస్తు ట్రిబ్యునల్ ను ఆశ్రయించనున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన లెక్కలు సరైనవి కాదని, కొత్త లెక్కలతో ట్రిబ్యురల్ ముందుకు వెళ్లాలని టిసర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.
-అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more