క్రిస్టియన్ల కోసం హైదరాబాద్ నగరంలో పది కోట్ల రూపాయలతో క్రైస్తవ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హామీ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్రిస్టియన్లకు నగరంలో ప్రత్యేక భవనం లేదన్న విషయం తమ దృష్టిలో ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంచి ఆర్కిటెక్చర్తో అంతర్జాతీయ స్థాయిలో దీని నిర్మాణం ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణ బాధ్యతలు పూర్తిగా డిప్యూటీ సీఎం టీ రాజయ్యకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా రెండు రోజులు సెలవులు ఇస్తామని ప్రకటించారు. జనవరి ఒకటిని కూడా సెలవుగా ప్రకటించారు. వచ్చే సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఆ భవన్లోనే జరుగుతాయని కేసీఆర్ చెప్పారు. ఈ భవనానికి డిసెంబర్ నెలలోనే శంకుస్థాపన కూడా జరుపుతామని తెలిపారు.
క్రైస్తవులకు ప్రత్యేక బోర్డు కూడా లేదని, త్వరలోనే ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్లోని పబ్లిక్గార్డెన్స్లోని లలిత కళాతోరణంలో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ -2014 వేడుకల్లో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పావురాలు, బెలూన్లు ఎగురవేసి కేక్ కట్చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళిత క్రిస్టియన్లను దళితులతో సమానంగా చూస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు ఏ మతం పుచ్చుకున్నా కులం మాత్రం మారదు. కానీ దళితులకు మాత్రం కులం మారుతుంది. దీనికి లాజిక్కే లేదు. కారణం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని అవకాశాలు హాస్టల్, స్కాలర్షిప్ వంటివి కూడా దళిత క్రిస్టియన్లకు అమలు చేస్తాం అని సీఎం చెప్పారు.
విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు అడిగారు.. దీనిపై చర్చించి సానుభూతితో నిర్ణయిస్తాం. 341జీవోలోని రాయితీలు అమలు కావడం లేదని అన్నారు. కలెక్టర్లు, అధికారులకు ఈ జీవో అమలుపై కొత్త ఆదేశాలు జారీ చేస్తాం అని సీఎం హామీ ఇచ్చారు. కొన్ని అసాంఘిక శక్తులు క్రైస్తవ ఫాదర్లు, పాస్టర్స్పై దాడులు చేస్తున్నాయి. దీన్ని ఖండిస్తున్నా. దాడులు నియంత్రించాలని ఆదేశాలు ఇచ్చిన. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి జరగకూడదు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు సంపూర్ణ రక్షణ ఉంటుంది. దాడి ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. కేసీఆర్ మాట ఇవ్వడు.. ఇస్తే తలతెగి పడినా మాట తప్పడు అని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లు ఆనందోత్సవాల మధ్య, వైభవంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more