రానురాను సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది... కేవలం డబ్బుకోసం కక్కుర్తిపడి సొంత బంధువులను, తోబుట్టువులనే అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు! కనీస మన కోర్కెలను కూడా సంతృప్తిగా తీర్చని డబ్బులకోసం.. జీవితాంతం సుఖసంతోషాలు పంచుకునేవారిని దూరం చేసుకుంటున్నారు ఆగంతుకులు! ఇటువంటి సంఘటనలు భారతదేశంలో కాలక్రమంలో ఇంకా పెరుగుతున్నాయి కానీ.. తగ్గుముఖం పట్టడం లేదు. ఈ తరహాలోనే తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం తన భార్య తండ్రి (మామ)ని స్నేహితులతో కలిసి దారుణంగా చంపేశాడో అల్లుడు! తర్వాత ఏమీ తెలియనట్టు కట్టుకథ అల్లేశాడు. అయితే పోలీసుల విచారణలో దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే... ఈనెల 15వ తేదీన కమీల్ అనే వ్యక్తి తన మామ షకీర్ అలీని ఎవరో చంపేశారంటూ ఫిర్యాదు చేశాడు. తన మామ షకీర్, స్నేహితుడు అనీస్ లతోపాటు తాను కలిసి షాపింగ్ కు వెళ్లామని.. షాగింప్ ముగిసిన అనంతరం ఘజియాబాద్ నుంచి వస్తుండగా గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్ లపై వచ్చి కాల్పులు జరిపారని తెలిపాడు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తన మామ షకీర్ అలీని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆసుపత్రికి వెళ్లేలోపే మరణించాడని పోలీసులకు వివరించాడు. ఎలాగైనా నిందితులను పట్టుకుని, వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులు ముందు దొంగ ఏడుపులు ఏడ్చాడు ఆ అల్లుడు కమీల్!
కమీల్ చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తమదైన రీతిలో విచారణను చేపట్టారు. మొదట్లో వాళ్లకి కాస్త క్లిష్టంగానే అనిపించినా... రానురాను వారి అనుమానాలు నేరుగా అల్లుడిమీదకు వెళ్లాయి. ఘటన జరుగుతున్నప్పుడు అతని మామతోపాటు కమీల్, అతని స్నేహితుడు కూడా అక్కడే వున్నారు. అయితే వాళ్లిద్దరు ఎటువంటి గాయాలు కాలేదు. పైగా సంఘటనాస్థలంలో బైక్ టైరు గుర్తులు కూడా లేవు. దీంతో వారి అనుమానాలు నిజమయ్యాయి. వాళ్లు తమదైన శైలిలో ఎంక్వైరీ చేసి నిజం రాబట్టారు. కేవలం ఆస్తికోసమే తామందరం ఈ హత్య చేశామని నిందితులు అంగీకరించినట్లు డిప్యూటీ కమీషనర్ రాజేంద్ర సింగ్ సాగర్ తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more