దైవాంశ సంభూతునిగా తనను తాను చెప్పుకొనే వివాదాస్పద స్వామి- రాంపాల్ను ఓ హత్య కేసులో భాగంగా అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను ఆయన శిష్యులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఛండీగడ్ లోని హిస్సార్ లో గల ఆయన ఆశ్రమం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2006 జులై 12న చోటు చేసుకున్న హత్యలో నిందితుడైన రాంపాల్.. విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనపై పంజాబ్-హరియాణా హైకోర్టు మరోసారి నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో హిసార్ జిల్లాలోని బర్వాలాలో ఉన్న సత్లోక్ ఆశ్రమం వద్ద జరిగిన ఘటనలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
నలువైపులా 50 అడుగుల ఎత్తున దుర్భేద్యంగా నిర్మించుకున్న 12 ఎకరాల ఆశ్రమం లోపల దాదాపు 3 వేల మంది రాంపాల్ అనుచరులు మానవ కవచంగా నిల్చోవడంతో పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్వామిని అరెస్టు చేస్తే తాము ప్రాణాలు తీసుకుంటామంటూ కొందరు వంటిపై డీజిల్ పోసుకుని ఆత్మాహుతి దళాలుగా నిలిచారు. ప్రైవేటు సైన్యంగా ఏర్పడిన కొందరు అనుచరులు పిస్తోళ్లు, రివాల్వర్లతో పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆశ్రమగోడను పగులగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా జేసీబీ వాహనానికి దుండగులు నిప్పంటించారు. ఆశ్రమంలో ఎల్పీజీ స్థావరాన్ని పోలీసులు గుర్తించాక మరింత అప్రమత్తంగా పావులు కదిపారు.
చట్టం నుంచి తప్పించుకునేందుకు దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే రాంపాల్.. ఆయన శిష్యులను రెచ్చగోడుతున్నాయి. దేశ న్యాయవ్యవస్థనే ధిక్కరిస్తూ.. చట్టాన్ని అగౌరవపరుస్తూ, దాడులకు దిగుతూతీవ్రవాదిలా వ్యవహరిస్తున్న స్వామీజీ నిజంగా దైవాంశ సంభూతుడా..? ఇంతకీ ఆయన ఎవరు..? ఎలా దేవుడిగా మారాడు..? ఆయన కోసం ఆయన శిష్యులు ఎందుకు రణరంగాన్ని సృష్టిస్తున్నారు..? తనపై నాన్ బెయిలెబుల్ వారెంట్లు జారీ చేయండని సవాల్ విసిరి.. ఇప్పుడు అరోగ్యం బాగోలేదని చెప్పడానికి కారణమేంటి..?
వివాదాస్పద స్వామీజీగా రికార్డులకెక్కిన రాంపాల్ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి. హర్యానాలోని ఇరిగేషన్ డిపార్టుమెంటులో జూనియర్ ఇంజనీర్ గా 2000 సంవత్సరం వరకు విధులు నిర్వహించాడు. అయితే ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంలో వ్యవహరిస్తున్న ఈయనను ఉన్నతాధికారులు అనేక పర్యాయాలు మందలించారు. తన ప్రవర్తనను ఏ మాత్రం మార్చుకోని రాంపాల్.. ఇక లాభం లేదని చివరకు 2000 సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో అధికారులు దానిని ఎట్టకేలకు అమోదించారు.
హర్యానా రాష్ట్రంలోని సోనిపాట్ జిల్లా గొహానా పట్టణం సమీపంలోని ధనానాలో సాధరణ రైతు కుటుంబంలో 1951 సెప్టెంబర్ 8న జన్మించారు రాంపాల్. చిన్నప్పుడు చదువుల్లో బాగానే రాణించిన రాంపాల్ ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసి హర్యానా ప్రభుత్వంలో ఉద్యోగాన్ని సంపాదించారు. అయితే అయనకు చిన్ననాటి నుంచి మతవాది. రాంపాల్ స్వామీజీకి సమాజంలోని బడుగు, దిగువ మధ్యతరగతి ప్రజల్లో చాలా పాపులారిటీ వుంది. అయితే అందరు స్వామీజీల మాదిరగా ఆయన తన భక్తులకు పలు వివాదాస్పద ప్రవచనాలు చేసేవారని కూడా విమర్శలున్నాయి. భగవత్ ఆరాధన, ఉపవాస దీక్షలు, హిందూ మతాన్ని అనుసరించి వుంటే ఇతర మతాలలోకి వెళ్లకూడదని తన భక్తులకు బోధించేవారు.
వివాదాలు, వివాదాస్పద వ్యవహారాలు రాంపాల్ కు కోత్తేమీ కావు. 2006లో రోహ్ తక్ జిల్లాలో జరిగిన మతఘర్షణలకు ఆయన ప్రవచనాలే కారహని తేలింది. దీంతో 1999లో హర్యానాలోని రోహ్ తక్ జిల్లాలోని కొరంత గ్రామంలో స్థాపించిన ఆశ్రమాన్ని 2006లో పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఆ ఘర్షణలలో బుల్లెట్ గాయాలు తగిలి ఒక వ్యక్తి మరణించాడు. దీంతో రాంపాల్ పై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అయితే అతని అనుచరులు మాత్రం రాంపాల్ స్వామీజీని అనవసరంగా కేసులో ఇరికించారని అరోపించారు. ఈ కేసు విచారణకు రాంపాల్ హాజరు కాకపోవడంతో పంజాబ్- హర్యానా హైకోర్టు ఇప్పటికే ఆయనపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసింది. నవంబర్ 5, 10, 17 తేదీల్లో కోర్టు హాజరుకాలేదు. నవంబర్ 17న కోర్టు మరోమారు ఎన్బీడబ్యూ జారీచేయగా తనకు అరోగ్యం సరిగా లేదని రాంపాల్ హాజరుకాలేదు. దీనిపై స్పందించిన కోర్టు 21 తేదీన రాంపాల్ ను కోర్టులో హాజరుపర్చాలని కోర్టు పోలీసులను అధేశించింది. హైకోర్టు అదేశాల మేరకు హిస్సార్ లోని రాంపాల్ అశ్రమానికి వెళ్లిన పోలీసులపైనే ఆయన భక్తులు దాడులకు తెగబడుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more