ఈమధ్య సినిమాల ప్రభావం దొంగలమీద బాగానే పడినట్లుంది... అందుకే ఆ తరహాలోనే తెలివిగా అధికారులకు తెలియకుండా భారీ దొంగతనాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్నే ఉత్తరభారతదేశంలో దాదాపు 125 అడుగులమేర భూమికింద ఒక గుంతతవ్వి, నేరుగా లాకర్లున్న చోటుకే వెళ్లి దొంగతనం చేసిన విషయం తెలిసిందే! ఆ దొంగతనాన్ని ఛేదించలేక పోలీసులు కొట్టుమిట్టాడుతుంటే.. తమను ఎక్కడ పట్టుకుంటారేమోనన్న భయంతో దొంగల్లో ప్రధాన నిందుతుడు కాల్చుకుని చనిపోయాడు. అది వేరే విషయం! తాజాగా వరంగల్ జిల్లా భూపాలపల్లిలో భారీ దొంగతనం జరిగింది. తాళాలు వేసినట్టే వున్నాయి కానీ లాకర్లలోని రూ.10 కోట్ల సొత్తు మొత్తం మాయం!
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస బ్యాంకుకు చెందిన రెండు శాఖల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ప్రధాన ద్వారం తాళాలు వేసినవి వేసినట్టే వున్నాయని.. అయితే లాకర్లలోని బంగారు ఆభరణాలు మాయం అయ్యాయని తెలిపారు. ప్రాథమిక విచారణలో భాగంగా భూపాలపల్లి బ్యాంకులో రూ.17.40 లక్షల నగదు, 16.212 కిలోల బంగారం చోరీకి గురైందని అధికారులు స్పష్టం చేశారు. ఈ చోరీ విలువ మొత్తం రూ.4.54 కోట్లవరకు వుంటుందని వాళ్లు పేర్కొన్నారు. దీంతో ఆ బ్యాంకు అధికారులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. అందులో వున్న ఖాతాదారులో సైతం ఆందోళనల్లో మునిగిపోయారు.
అదేవిధంగా ఆ బ్యాంకుకు చెందిన ఆజంనగర్ శాఖలో కూడా దొంగతనం జరిగింది. అందులో రూ.4.37 కోట్ల నగదు, 18 కిలోల బంగారం చోరీకి గురైందని పేర్కొన్నారు. రెండు బ్యాంకుల్లో మొత్తం కలిసి రూ.10 కోట్ల మేరకు సొత్తు చోరీకి గురైందని డీఎస్పీ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించి విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదిలావుండగా.. తాళాలు వుండగానే ఒకే బ్యాంకుకు సంబంధించి రెండు శాఖల్లోనూ దోపిడీ జరగంవెనుక బ్యాంకు సిబ్బందిపాత్రగానీ, బ్యాంకు గురించి తెలిసినవాళ్లు ఎవరో చేయించి వుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more