మానవుడు మళ్లీ చరిత్ర సృష్టించాడు. ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక నూతన అద్యాయానికి పేజీ తెరిచాడు. తొలిసారిగా ఓ తోకచుక్కపై స్పేస్క్రాఫ్ట్ ల్యాండ్ చేశాడు. తన అపరమేధస్సుతో దానిపైకి దిగాడు. 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి.. విశ్వ రహస్యాన్ని దాచుకుని, ఊహించ లేని ప్రచంఢవేగంతో సూర్యుడి చుట్టూ తిరిగే తోకచుక్కపైకి మానవుడు చేరాడు. అంతరిక్షంలో మానవ మనుగడపై చేస్తున్న పరిశోధనల్లో ఇది మరో మైలురాయిగా నిలిచింది. రెండు మైళ్ల పొడవున్న 67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో అనే తోకచుక్కపైకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ‘రొసెట్టా స్పేస్క్రాఫ్ట్’కు చెందిన ‘ఫిలే లాండర్’ దిగ్విజయంగా ల్యాండ్ అయ్యింది.
భారత కాలమానం ప్రకారం నిన్నరాత్రి 9.30 గంటలకు ఈ అద్భతాన్ని అవిష్కరించింది. సరిగ్గా స్పేస్ క్రాప్ట్ నేలను తాకినట్లు ఈఎస్ఏ శాస్త్రవేత్తలు తెలిపారు.‘మానవ నాగరికతలోనే ఇది ఓ మైలురాయి’ అని ఈఎస్ఏ డైరెక్టర్ జనరల్ జీన్ జాక్వెస్ డోర్డెయిన్ పేర్కొన్నారు. ఫిలే లాండర్.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు రోసెట్టా ఆర్బిటర్ నుంచి వేరయింది. ఆ తర్వాత చుర్యుమోవ్ను చేరుకోవడానికి ఏడు గంటలు పట్టింది. ఆ సమయంలో ఫిలే దాని చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను నమోదు చేసింది. తోకచుక్కమీదకు దిగే సమయంలో ఫిలే ఫొటోలనూ తీసింది. అయితే ఫిలే.. దాని సమాచారాన్ని నేరుగా భూమికి చేరవేయలేదు. రోసెట్టా ఆర్బిటార్కు సమాచారాన్ని చేరవేస్తుంది. దాని నుంచి భూమికి సమాచారం అందుతుంది.
రోసెట్టా దిగ్విజయంగా తొకచుక్కప ల్యాండ్ అయిన సందర్భంగా ఈఎస్ఏ శాస్త్రవేత్తలు సంతోషంలో నిమగ్నమయ్యారు. ఒకరినోకరు హగ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అరుదన ఘట్టానికి తెరతీయడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాల సర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా ఈ అద్బుతానందాన్ని పంచుకుంది. ఖగోళ శాస్త్రంలో మరో మైలు రాయికి యూరోపియన్ శాస్త్రవేత్తలు తెరతీయడంతో.. గూగూల్.. బహుచక్కని డూడుల్ తో శాస్త్రవేత్తల శ్రమ మాటున దాగివున్నఆనందాన్ని పంచుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more