సుమారు ఆరు మిలియన్ డాలర్ల మేర మెసాలకు, కుట్రలకు పాల్పడిన ఇద్దరు భారతీయ సంతతికి చెందిన యువకులను ఎఫ్ఐబి అధికారులు అరెస్టు చేశారు. కుట్రపూరితంగా బాధితుల నుంచి తమ ప్రీపెయిడ్ కార్డులులలోకి డబ్బు జమ చేయించుకని మోసాలకు పాల్పడిన ఇద్దరిని అమెరికా ఎఫ్ బి ఐ అధికారుుల, ప్రభుత్వ ఏజెంట్లు కలసి అరెస్టు చేసినట్లు అమెరికా అటర్నీ పాల్ జె ఫిష్ మాన్ వెల్లడించారు. అల్పేష్ కుమార్ పటేల్ (30) విజయ్ కుమార్ పటేల్ (39)లు కలసి కుట్రలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.
ఫిలడెల్ఫియాలో నివసించే విజయ్ కుమార్ పటేల్ నివాసంలో మోసాలకు పాల్పడుతుండగా వీరిని అరెస్టు చేశారు. మోసం, కుట్ర ఇత్యాదులకు పాల్పడిన వీరికి సుమారుగా 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రెండు లక్షల యాభై వేల మిలియన్ డాలర్ల మేర జరిమానా కూడా విధించవచ్చని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ మాసం నుంచి ఈ ఏడాది మార్చి వరకు వీరు కుట్రపూరితంగా మోసం చేసి సుమారుగా 5.8 మిలియన్ డాలర్ల డబ్బును ఆర్జించారని అభియోగాలు నమోదయ్యాయి.
గుర్తు తెలియని అగంతకుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో తాము డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఎఫ్ ఐ బికి పిర్యాదులు వెల్లువెత్తడంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. న్యూజెర్సీలోని రిటైల్ షాపులో బాంబు వుందని, ఐదు నిమిషాల్లో అది పెలుతుందని, దానిని తొలగించాలంటే తక్షణం తమ ప్రీపెయిడ్ డెబిట్ కార్డులోకి డబ్బును పంపాలని డిమాండ్ చేశారు. అప్పటికే కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఎఫ్ బి ఐ సదరు దుకాణానికి వెళ్లి డబ్బును వేయవద్దని కోరారు. ఆ ఫోన్ ఎవరు చేశారన్న విషయంపై ఆరా తీయడంతో పాటు సదరు డెబిట్ కార్డు అకౌంట్ ఎవరిదన్న విషయంపై కూపీ లాగారు. దీంతో అది ఫిలబోల్పియాలోని విజయ్ కుమార్ పటేల్ అని నిర్ధారించుకున్న ఎఫ్ బి ఐ ఆయన నివాసానికి వెళ్లి అతనితో పాటు అల్పేష్ కుమార్ పటేల్ కూడా అదుపులోకి తీసుకున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more