విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సమస్యలు ఏర్పడిన విషయం తెలిసిందే! ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గురించి మాట్లాడితే... మొదట నుంచి ఎన్నో ఇబ్బందులు ఆ రాష్ట్రాన్ని వెంటాడుతూనే వున్నాయి. అయినా కేసీఆర్ తనదైన తెలివితో రాష్ట్రాభివృద్ధికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తీవ్ర విద్యుత్ సంక్షోభం మాత్రం ఆయనకు పెద్ద సమస్యగా మారిపోయింది. రాష్ట్రం ఏర్పడిన మొదటినుంచి ఇప్పటివరకు విద్యుత్ సంక్షోభ సమస్యను మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోతోంది. అసలు ఆ సమస్య నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభత్వానిది! ఎంత ధర చెల్లించయినా విద్యుత్ ను కొందామని కేసీఆర్ భావిస్తే... అమ్మేవారు మాత్రం అస్సలు కనిపించకపోవడంతో ఏం చేయాలో తోచక అయోమయంలో మునిగిపోయారు. ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ దొరికినా.. అక్కడి నుంచి తరలించడం చాలా కష్టం! మొత్తానికి విద్యుత్ కొరత తెలంగాణ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టేస్తోంది.
మరోవైపు విద్యుత్ సంక్షోభం కారణంతో తెలంగాణ రాష్ట్రంలో పంటలు చాలావరకు దెబ్బతినడంతో అప్పులపాలైన రైతులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. తమకు కనీస ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిందేనంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నా... విద్యుత్ లభించకపోవడంతో ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. దీంతో తీవ్ర అసహనానికి గురవుతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 250పైగా రైతులు మరణిస్తే.. తాజాగా ఒక్క గురువారం రోజే మరో ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ముగ్గురు రైతులు సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలోనే వుండటం సంచలనంగా మారిపోయింది. ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడం కారణంగానే రైతులు ఇలా ఒక్కొక్కరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే విద్యుత్ సంక్షోభంతో సతమతమవుతున్న తెలంగాణ సర్కారుకు.. వరుసగా రైతులు బలవన్మరాలకు పాల్పడటం కేసీఆర్ కు పెద్ద శాపంగా మారే వీలుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రైతులు కూడా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి ఇన్నాళ్లయినా ఇంకా విద్యుత్ సంక్షోభ సమస్యను ఎందుకు తీర్చడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వీరికితోడు తెలంగాణాలో వున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు విద్యుత్ సమస్యకు, రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే కారణమంటూ తేల్చి చెబుతూ ప్రచారాలు చేస్తున్నారు. రైతులు ఇలాగే ఆత్మహత్యలు చేసుకుంటే... తెలంగాణాలో ఆయన మీద వ్యతిరేకత వ్యక్తమవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి.. ఎట్టిపరిస్థితుల్లోనూ కేసీఆర్ విద్యుత్ సంక్షోభ సమస్యను పరిష్కరించి, రైతులు భరోసా ఇవ్వడంలో సఫలం అయితే మంచిదని... లేకపోతే అవి ఆయనకు శాపంగా మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more